MohanPublications Print Books Online store clik Here Devullu.com

అర్థనారీశ్వర దేవాలయం- విరూపాక్షపురం_ArdanariswaratempleVIRUPAKSHAPURAM_


అర్థనారీశ్వర దేవాలయం-

విరూపాక్షపురం



శ్రీకాళహస్తి తాలూకా తొట్టంబేడు మండలంలో, సువర్ణముఖినదీ తీరాన విరూపాక్షపురమనే గ్రామంలో ప్రాచీనమైన ‘అర్థనారీశ్వర స్వామి దేవాలయం’ వెలసి ఉంది. శివుని అర్థనారీశ్వరునిగా ఆలయ గోడలపైన, విమానం మీద చూపడం కలదుగాని, మూలవిరాట్టు అయిన లింగమే అర్థనారీశ్వరుడి రూపంలో వెలయడం అపూర్వం. పురాణాలలో ఈ ఆలయాన్ని ‘పాపివిచ్చేదక్షేత్రం’ అని పేర్కొన్నారు. శివపురాణంలో ‘శ్రీవిజయసఖ మాంబల’ చరిత్ర ఇది. ఉత్తరదేశంలోని ఆర్యావర్తంలోని అవంతీ నగరంలో అందమైన యువదంపతులు నివసించే వారు. వారు విసయ, సుభగలు, బాల్యం నుంచి విజయునికి పరమేశ్వరునిపై ఎనలేని భక్తి ఉండేది. అతను పిన్నవయస్సులోనే ఇంద్రియ విగ్రహాన్ని కలిగి దైవాన్ని దర్శించాలని నిశ్చయించుకొన్నాడు. ఒకరోజు విజయుడుమార్కండేయ మహర్షిని దర్శిం చి, తనకు మోక్షమార్గాన్ని ప్రబోధించమన్నాడు. మహర్షి విజయునితో పరమేశ్వరుని ప్రసన్నుని చేసుకునే విధానాన్ని తెలుపుతూ దక్షిణకాశిక వాసి కెక్కిన శ్రీకాళహస్తి వెళ్లి, ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తిశ్వరుని పూజించి జన్మను తరింపజేసు కోమన్నాడు. మార్కండేయ మహర్షి చెప్పినట్లుగా శ్రీకాళహస్తికి భార్యాసమేతంగా వచ్చి, విజయుడు చిన్న పర్ణశాలలో నివసిస్తూ రోజు సువర్ణముఖిలో స్నానం చేసి నుదుట విభూది రేఖలు, మెడలో రుద్రాక్షలు ధరించి ఆలయానికి వెళ్లి, దీక్షతో స్వామి ని సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు విజయుడు స్వామి ధాన్యంలో సాయంకాలం వరకు ఆలయ మందే గడిపిఇంటికి వచ్చాడు. అతడి భార్య సుభగ భర్తకు ఇష్టమైన తీయటి వంటలు చేసి, అతడి చేత తినిపించింది. భుక్తాయాసంతో విజయుడు మేను వాల్చగానే, సుభగ పూర్తిగా అలంకరించుకొని భర్త ను చేరింది. భార్య కోరేదేమిటో అతడికి అర్థం కాలేదు. యుక్తవయసులో ఉన్న భార్య చనుకట్టు విజయునికి రెండుబంగారు శివలింగాలుగా కనబడ సాగినాయి. భార్య పడక పక్కనే ఉంచిన పూలు, సుగంధ ద్రవ్యాలు ఆ చనులపై జల్లి, వాటిని శివ లింగాలుగా భ్రమించి రాత్రంతా పూజించసాగాడు సుభగ, భర్త తన కోర్కె తీర్చలేదని బాధపడింది. తెల్లవారగానే విజయుడు లేచి యథావిధిగా ఆల యానికి వెళ్తూ రాత్రి తన ఇంటిలో ఎలా రెండు శివలింగాలు వెలిసినాయి? అది సాధ్యమేనా? అని ఆలోచిస్తూ తన భార్య శారీరక సుఖాన్ని ఆశించి తన్ను మభ్యపెట్టినందువల్లే ఈ విధంగా జరిగి ఉంటుందని, ఇక తాను ఇంట్లోనే ఉంటే తన ధ్యేయం వృథా అయిపోతుందేమో! అయినా చిన్న వయసులో ఉన్న భార్యను ఎలా వదిలిపెట్టి వెళ్లాలి అని ఆలోచిస్తూ ఏమీ నిర్ణయించు కోలేక పోయాడు. యథావిధిగా ఆరోజురాత్రి ఇంటికివచ్చి మౌనంగా నిద్రించాడు. నిద్రలో పరమేశ్వరుడు కనబడి శ్రీకాళహస్తికి ఉత్తరంగా సువర్ణముఖీ నదీ తీరాన యుగాలకు పూర్వం నుంచే దేవతలు, రుషులు మొదలగు వారి చేత పూజలందుకుంటూన్న అర్థ నారీశ్వరుని సేవించి తరించమన్నాడు. మరునాడు విజయుడు వేకువజామునే లేచి భార్యను, ఇంటిని వదిలి ఒంటరిగా స్వామి సెలవిచ్చినట్లు సువర్ణ ముఖీ నది గుట్టు వెంటే నడిచి వెళ్లి అర్థనారీశ్వర స్వామి వెలసి యున్న పాపవిచ్చెద క్షేత్రం చేరి స్వామని నిష్టతోకొలువసాగాడు. పొద్దునలేచి చూస్తే భర్త జాడలేదు. పెనిమిటి కనిపించకపోవడంతో సుభగ తన వల్లనే పరమపవిత్రుడైన తన భర్త ఇల్లు వదిలి వెళ్లాడని, అతడి అడుగుజాడలలోనే నడిచి స్వామిలో లీనమైపోవాలని నిశ్చయించుకొని కొంత మంది యోగుల ద్వారా శివపూజా విధానాన్ని తెలు సుకొని రోజు బంకమట్టితో 108 శివలింగాలు చేసి ఎంతో భక్తితో ఆ స్వామిని పూజించసాగింది.
ఆమె భక్తిని పరీక్షించదలచి ఒకరోజు మహేశ్వరుడు అందమైన బ్రాహ్మణ యువకుని వేషంలో ఆమెను సమీపించి ‘ఎందుకిలా అందమైన కాలాన్ని వృథా చేస్తావ్ఞ? నేను నీకు సలక సౌకర్యాలు కలుగజేస్తాను. నీవు నాతో వస్తే మనం ఆనందంగా జీవించ వచ్చు అని పలుకగా, అతడి మాటలేవీ ఆమె మన స్సుకు సోకలేదు. తుదకా బ్రాహ్మణుడు ఆమెను సమీపించి బలవంతం చేయ బోగా ఆమె కళ్లు మూసుకుని ‘స్వామి! కాళహస్తిశ్వరా నన్ను రక్షించు అనగా ఆమె కళ్ల ఎదుట జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమై బాల! నీ భక్తిని పరీ క్షించడానికే ఈ విధం నాటక మాడినాము. నీకు మ వరం కావాలో కోరుకోమనగా, సుభగ ఆది దంపతులారా! నాకు పునర్జన్మ లేకుండా శాశ్వతంగా మీలో ఐక్యం చేసుకోండి అని కోరింది. పార్వతీ పరమేశ్వరులు ఆమె కోరిక మేరకు ఆమెను తమలో విలీనం చేసుకొన్నారు. పాపవిచ్చేద నిద్రాహారాలు మాని స్వామిధాన్యంలోనే మునిగిపోయాడు. హరు డు అతడిని కూడా పరీక్షింపనెంచి తన గణాలలోనే చంద్రహాసుని విష్ణురూపంలో విజయుని వద్దకు పంపి ఎందుకు ఆ భిక్షగాడిని పూజిస్తావు. ఇల్లు వాకిలి లేదు. శ్మశానంలో వుంటాడు. ఆభరణాలు లేవు. సర్పాలు ధరిస్తాడు. శ్మశానంలో బూడిదను ఒంటికి రాసుకుంటాడు. అతడి వల్ల నీకు కలిగే లాభమేమిటి? నన్ను పూజిస్తే సకల సౌకర్యాలు లభిస్తాయి. స్వర్గప్రాప్తి కలుగుతుంది. నా భార్య లక్ష్మీదేవి కటాక్షం వల్ల సకలభోగాలు అనుభవిస్తావు అని చెప్పగా విజయుడు కోపగించి, హరుడి మహత్మం తెలియదా? బ్రహ్మ తేజో రూపంలో శివుని ఆద్యతాలు గుర్తించక అపహాస్య పాలు కాలేదా? శివుడివల్లే కదా సకల ఐశ్వర్యాలు నీవు కృతజ్ఞతునై మాట్లాడుట తగునా అని పలుకగా, చంద్రహాసుడి రూపంలో ఉన్న హరి ప్రత్యక్షమై ‘భక్తా’! స్వామి వారే నీ భక్తిని పరీక్షించుటకు నన్ను ఈ రూపంలో పంపినాడు. నీ భక్తికి మెచ్చినాను. పార్వతి పర మేశ్వరులు త్వరలో నీకు ప్రత్యక్షమౌతారని సెలవిచ్చి వెళ్లాడు.
ఆలయ సౌందర్యం
అర్థనార్వీర దేవాలయం తూర్పునకు అభిముఖంగా నిర్మించారు. ఇందులో గర్భగృహం, అంతరాళం, ముఖమండపాలున్నాయి. గర్భాలయంలో ‘సుఖ గాంబ సమేత’ శ్రీ విజయేశ్వరస్వామి పేర స్వయం భూలింగం ఉంది.
ఈ లింగం రెండు ముఖాలను కలిగి ఉంది. శివుని భాగంగా భావించబడతూ ఉన్న పక్షం తెల్లగా మంచువలే ఉండగా, దేవి భాగం పసుపు రంగును కలిగి ఉంది. ఈ లింగం రెండు ముఖాలను కలిగి ఉంది. శివుని భాగంగా భావించబడుతూ ఉన్న పక్షం తెల్లగా మంచు వల్లే ఉండగా, దేవి భాగం పసుపు రంగును కలిగి ఉంది. ఈ అర్థనారీశ్వర స్వామిని భక్తులు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం లాంటి ప్రత్యేక సందర్భాల్లో, శుక్ర, సోమవారాల్లో, ఏకాదశి, కృత్తిక, శివరాత్రి పర్వదినాల్లో విశేషంగా పూజించి తరిస్తారు.

1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list