MohanPublications Print Books Online store clik Here Devullu.com

గాయత్రి గురించి మహాత్ములు చెప్పినవి, About Gayathri Mantram

గాయత్రి గురించి మహాత్ములు చెప్పినవి
About Gayathri Mantram

గాయత్రి గురించి మహాత్ములు చెప్పినవి
వేదవ్యాస మహర్షి - గాయత్రి మంత్రమును జపించకుండా ఇతర మంత్రములను జపించుట భోజనానికి సిద్ధంగా ఉన్న భోజనాన్ని వదిలి ఆడుక్కుని తినటం లాంటిది.శతపథ బ్రాహ్మణం ఐతరేయబ్రాహ్మణం లో
' బ్రహ్మయే గాయత్రి గాయత్రియే బ్రహ్మ ' అని చెప్పబడింది.
🚩🚩🚩
విశ్వామిత్రుడు - " బంగారపు రంగులో ఉన్న సూర్యబింబము మధ్యలో గాయత్రీ మాతను ధ్యానిస్తూ మంత్రజపం చేసిన యడల శీఘ్రముగా జనన మరణాల నుండి ముక్తుడవుతాడు.
🚩🚩🚩
దేవీభాగవతము - గాయత్రీ మోక్ష విద్య తెలుపు రంగు తేజస్సుతో ప్రకాశించి బుద్ధిని పవిత్రంచేస్తుంది.' తత్ సవితుర్వరేణ్యం భర్గః '
🚩🚩🚩
కూర్మపురాణము - ముల్లోకాలకు జ్ఞానమును ప్రసాదించేసి గాయత్రీ దేవతయే ఆమెయే వేదమాత గాయత్రిని మించిన మంత్రము లేదు
🚩🚩🚩
యాజ్ఞవల్క్యుడు - ఓక త్రాసులో ఇటు వేదాలు ఆటు గాయత్రి మంత్రమును ఉంచి తూచినచో గాయత్రి మంత్రము వైపే త్రాసు మొగ్గును.
🚩🚩🚩
ఆర్షసూక్తి - 'న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పర దైవతం'
🚩🚩🚩
భీష్మాచార్యులు - ఓ ధర్మరాజా గాయత్రీ మంత్రమును విడిచి పెట్టకుండా ఏవరు జపిస్తారో వారు దుఃఖం పోందరు
🚩🚩🚩
అత్రి మహర్షి భవిష్య పురాణం - సూర్యుని ఏదుట ఏనిమిది వేలు గాయత్రీ జపం చేసిన యడల సర్వ పాపములనుండి విముక్తుడవుతాడు
🚩🚩🚩
లఘు అత్రి సంహితా - గాయత్రీ ని జపించే వారిని మాత్రమే పితృకార్యాలకి ఆహ్వానించాలి
🚩🚩🚩
పద్మపురాణం పరాశర మహర్షి - గాయత్రిని జపించు వారి మహాపాపాలు పాపాలు ఉపపాపాలు కూడా నశిస్తాయి
🚩🚩🚩
అగ్నిపురాణం - ఏ బ్రాహ్మడు నిత్యం ఉదయం సాయం సంధ్యలలో గాయత్రీ ఉపాసన చేస్తాడో ఆతడు ఏలాంటి దానము స్వీకరించినా దోషములు కలుగవు
🚩🚩🚩
శంఖ స్మృతి - నరక నివారణకి వేదముల ఉపనిషత్తుల సారమైన గాయత్రిని మించిన మంత్రము లేదు
🚩🚩🚩
సూత సంహితా యజ్ఞవైభవ ఖండం - అన్నముతో జలముతో సమానమైన దానము అహింసతో సమానమైన తపస్సు గాయత్రిని మించిన మంత్రము లేదు
🚩🚩🚩
నారద మహర్షి - గాయత్రీ సమస్త దేవతా స్వరూపము ఆమె ఉన్న చోట శ్రీమన్నారాయణుడు నివసిస్తాడు ఇందు సందేహము లేదు
🚩🚩🚩
వశిష్ట మహర్షి - మూర్కుడు కూడా గాయత్రిని జపించిన ఉన్నత స్తితికి వెళ్ళును.వాడు దేవతలలాగా భూమిమీద ప్రకాశిస్తాడు.
🚩🚩🚩
మహాత్మాగాంధీ - నిత్యం గాయత్రిని జపించు వారికి ఆత్మోన్నతి మరియూ రోగనాశనం ఆపద నాశనం‌ జరుగును.
🚩🚩🚩
ఆదిశంకరులు - గాయత్రి మహిమ వర్ణించ మానవ సామర్థ్యం సరిపోదు ఇదియే ఆది మంత్రంము.
👏👏👏👏
అందుకే నిత్యం ఉదయం,మధ్యాహ్నం, సాయంత్రం గాయత్రీ ఉపాసన చేయటం చాలా మంచిది...


LIKE US TO FOLLOW: ---




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list