MohanPublications Print Books Online store clik Here Devullu.com

గోవుపాట, Song Of Cow

గోవుపాట
 Song Of Cow

గోవుపాట:-------
గోవు అడుగులయందు అష్టైశ్వర్యములుండును.
గిట్టల మధ్యన గంధర్వులుందురు.
పాదాలయందు చతుర్వేదములుండు
పిక్కలయండు గుడి గంటలుండు
గిట్టల చివర పన్నగులుందురు
గిట్టల ప్రక్కలో అప్సరసలుందురు
తొడలయందు సర్వలోక తీర్ధములుండు
పొదుగున పుండరీకాక్షుడు ఉండును
చనులయందు సాలగ్రామాలుండును
పితుకుల యందు సప్త సముద్రములుండు
నాభియందున శ్రీకమలముండు
కడుపున భూదేవి స్థిరముగానుండు
తోకను సోముడు నివసించుచుండును
తోకయందలి రోమాల సూర్యరశ్మి యుండు
ఉర మధ్యమున ఋషులు నివసింతురు.
చర్మమున సకల శుభములు వర్ధిల్లు
శరీరములోని రోమాల సకల దేవతలు ఉండు
మాంసమున మాధవుడు నిలయమై ఉండు
ఎముకల యందు బ్రహ్మ నివసించు
పృష్ట భాగమున ఏకాదశ రుద్రులు ఉండెదరు
హృదయమున సాధ్వులు వసించుచుందురు
మూపురమున చుక్కలు మెరయుచునుందురు
మెడను ఇంద్రుడు నివసించుచుండు
పెదవులు వైకుంట ద్వారములగును
నాలుకయండు నారాయణుడుండు
దవడలయందు ధర్మదేవత యుండు
నోరున లోకేశము నిలయమై యుండు
హుంకారమున సరస్వతీ దేవి నివసించు
ముక్కున శీతాచల పుత్రి యుండు
ముక్కు కాడన కుమార స్వామి వర్ధిల్లు
గడ్డము కైలాస శిఖరమై యుండు
నుదురున పరమేశ్వరుడు నివసించును
నేత్రముల సూర్య చంద్రులు మెరయు
కర్ణముల అశ్వనీ దేవతలు వెలయు
కొమ్ములు గోవర్ధన పర్వతములగును
కొమ్ముల కొసలు సర్వ తీర్ధములగును
గోవు పాలయందు సరస్వతీ నదియు,
పంచితమున గంగానదియు,
గోమయమున శ్రీమహాలక్ష్మియును
ఆజ్యమున అగ్నిదేవుడును నివసించును
గోవుపాట పాడిన ఫలితమెయ్యది యనగా
వేకువన పాడితే కోటి వేల నదులలో స్నానాలు చేసిన ఫలితం
ప్రొద్దున్నే పాడితే కోటి వేల బ్రహ్మ కలశాల నోము నోచిన ఫలితం
మధ్యాహ్నమున పాడితే కోటి వేల బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం
సంధ్య వేళ పాడితే కోటి దేవాలయములలో దీపారాధన చేసిన ఫలితం
అమావాస్య నాడు పాడితే ఆరునెలల పాపం,
పౌర్ణమి నాడు పాడితే పది నెలల పాపం పోవును
గోవును వర్ణించిన ఇంతికి సకల శుభములు, ఇహ పర సుఖములు కలుగును
------'----------------------------
సకల దేవతా స్వరూపం గోమాత!
సద్గతులనిచ్చే గోవ్రతం
మన దైనందిన జీవితంలో మనతోపాటు మమేకమై కలసిపోయిన జీవి గోవు. గోవుని శ్రీమన్నారాయణుడి రూపంగా
పురాణాలు చెబుతున్నాయి. ఈ చరాచర సృష్టిలోని సమస్త దేవతలు గోవులో నిక్షిప్తం అయి ఉన్నాయని, ఆ కారణంగా గోవును వధించడం, దూషించడం పాపంగా పురాణాల ద్వారా అవగతమవుతోంది. అనాదిగా గోవును దైవస్వరూపంగా పూజిస్తున్నారు.
మన నిత్య జీవితంలో ‘గోవు’ ఓ ప్రధానావసరంగా మనం వినియోగించుకుంటున్నాం. గోవుపాలు, పంచకం, నెయ్యి, పేడ ఇవన్నీ మనకు ఎంతగానో ఉపయోగపడ్తున్నాయి. భౌతిక ప్రపంచంలో మనకు చేదోడువాదోడుగా ఉంటున్న ఈ గోవును పురాణాలలో దైవంగా అభివర్ణించారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి రూపమైన గోవును పూజించడం, అందునా ఓ పద్ధతి ప్రకారం పూజించడం సమస్త పుణ్యాలనిస్తుందంటారు. దీనికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి వాడుకలో ఉంది.
పురాణ గాథ:-
పూర్వమొకపుడు పాండురాజు భార్య అయిన కుంతీదేవి, తన మేనల్లుడు, శ్రీమన్నారాయణుడి అంశ అయిన శ్రీకృష్ణ్భగవానుని దగ్గరకు వెళ్ళి ‘‘మధుసూదనా...స్ర్తిలు దోషభూయిష్టమైన రుతుకాలంలో ఇంట్లోవారిని ముట్టుకోవడం, సూదితో వస్త్రాలను కుట్టడం లాంటి పనులు తెలిసీ తెలియక చేస్తూ వుంటారు. అలాగే పెద్దలను
నిందించడం, స్వపర ద్రవ్యాపహరణం లాంటి దుష్కర్మలు తెలిసికొని, తెలియక కాని చేస్తూ వుంటారు. అలాంటి
దుష్టకార్యాలు చేసినపుడు సంక్రమించిన పాపాలు పోవడానికి ఆచరించాల్సిన వ్రతమొకదానిని చెప్పమని అడిగిందట. దానికి శ్రీకృష్ణ్భగవానుడు, కుంతీదేవిని ఉద్దేశించి, ఆయా పాపాలన్నీ పోవడానికి గోవ్రతమనే వ్రతం
ఉందని దానిని ఆచరిస్తే ఆయా పాపాలన్నీ పోయి, సర్వసౌఖ్యాలు సొంతమవుతాయని చెప్పాడు. ఈ
వ్రతం నాలుగు విధాలుగా ఉంటుందని, దీనిని ఆచరిస్తే పాప విముక్తులై, పుణ్యం సిద్ధిస్తుందని చెప్పాడు. అలాగే జపతపాలు, వ్రతోపవాసాలు తదితరాలవల్ల కలిగే పుణ్యం గోవ్రతంవల్ల కూడా కలుగుతుందని చెప్పాడు.
సూర్యుడు మకరంలోకి ప్రవేశించినపుడు కానీ, రథసప్తమినాడు కానీ, తమ జన్మనక్షత్రానికి అనుకూలమైనపుడు ఈ వ్రతాన్నిఆరంభించాలి. అలాగే రజోదోషం వీడిన స్ర్తిలు 18 నెలల తరువాత ఈ వ్రతాన్ని ఆచరించాలి. మకర సంక్రాంతి, రథ సప్తమి, మంగళవారంతో కూడినకృష్ణచతుర్దశి, కార్తీకం, మార్గశిర మాసాలలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దోషాలు మటుమాయవౌతాయి. శ్రీకృష్ణుని సూచనమేరకు కుంతీమాత ఈ వ్రతాన్ని ఆచరించి, సద్గతి పొందింది. ఆనాటినుంచి ‘గోవు’దైవంగా పూజింపబడ్తూ, నీరాజనాలందుకుంటోంది.
గోవ్రతం చేయడానికి నియమాలు:
* ఈ వ్రతం చేసేవారు ప్రాతఃకాలంలోనే నదీ స్నానం చేయాలి.
* నిత్యపూజాదికాలను ముగించుకున్న తర్వాత ఇంటికి తూర్పున మంటపం వేయాలి. అయిదు రంగులతో స్వస్తిక్,
పద్మక, నాగబంధాది మండలాలను నిర్మించాలి.
* లక్ష్మీనారాయణుడి ప్రతిమను బంగారం, వెండి లేదా యథాశక్తి చేయించి పంచామృతాలతో అభిషేకించాలి.
* ఆవు, దూడ కల ప్రతిమను బంగారు, లేదా వెండి లేదా యథాశక్తి చేయించాలి. అనంతరం పంచామృతాలతో అభిషేకించాలి.
* ఆ ప్రతిమలను బియ్యపురాశిలో ఉంచి పంచ పల్లవమాలతో పంచ వల్కలములతో నలంకరించి కలశాన్ని కొత్త వస్త్రాల చాపుతో చుట్టి పూజించాలి.
* అనంతరం దూడ కల్గినటువంటి ఆవును పూజించాలి.
* ఆవును రాత్రి నాలుగు జాములయందు పూజించి పురాణ శ్రవణాదులతో రాత్రి జాగారం చేయాలి.
* తర్వాత సంప్రదాయానుసారంగా అగ్నిప్రతిష్టచేసి, సమిధలు, పాయసాన్ని హవిస్సు చేసి, హోమం చేయాలి.
పూర్ణాహుతినిచ్చిన తర్వాత ఆచార్యునికి ప్రతిమను, వస్త్రాలతో దానమీయాలి.
* గో దానాన్ని శక్తి ఉంటే మిగిలిన దశ/షోడశ దానాలను చేసి పనె నండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి.
ఇలా ఈ వ్రతాన్ని ఆచరించేవారు అన్ని వేదాలు చదివితే వచ్చే పుణ్యఫలాలను అన్ని తీర్థాలందు స్నానమాచరించిన
పుణ్యఫలాలను పొంది సద్గతులను పొందుతారని శ్రీకృష్ణ్భగవానుడు చెప్పాడు.
గావో విశ్వస్యమాతర:
గోవు సమస్త విశ్వానికి తల్లి . ” సమస్త జీవరాశిని పాలించి , పోషించి , కాపాడే తల్లి గోమాత ” . అని స్పష్టం చేసింది . ధర్మాసనం మీద ఆసీను రాలైన భారత మాత . ఇది సనాతన ధర్మ దివ్య శంఖారావం . గోవు అందించే ప్రతి అంశము సమస్త సృష్ఠికి ఆశీర్వాదమే.
” మహస్త వేవ గోర్మహమా ” అని శత పధ బ్రాహ్మణం చెపుతుంది . ” గోవు మహిమ ఎంత వర్ణించినా తక్కువే ” అని అర్ధం . ” దేను సదనం రాజీనా౦ ” అని అధర్వణ వేదం స్పష్టం చేసింది . అంటే గోవు సమస్త సంపదలకు మూలం . గావ: స్వర్గస్య సోపానం గావ:స్వర్గేపి పూజితా: ( మహాభారతం) ” గోవులు స్వర్గానికి సోపానాలు . గోవులు స్వర్గం లో కూడా పూజింప బడుతాయి ” . ” గోఘ
భక్తశ్చలభతే యత్ యది చ్ఛతి మానవ: ( మహాభారతం) ” గోభక్తుడైన మానవుడు ఏమి కోరికలు కోరుకుంటాడో అతనికి అవన్నీ లభిస్తాయి ” .
యాయ౦ గావో భేదయిథాకృష౦చిద్ షీర౦చిత్ క్రునుథా సుప్రథీక౦ భద్ర / గృహం కృనుథ భద్రవాచో వృహద ఓవయి ఉచ్చతే సభాసు // ( ఋగ్వేదం )
ఓ గోమాత , నువ్వు బలహీనుడిని కూడా బలవంతుని చేస్తావు . వర్చస్సును తెస్తావు . ఇంటిని సుఖ సంతోషాలతో నింపుతావు . నీ అమృత ప్రాయమైన పాల గురించి అంతా చెప్పుకుంటారు ” . తృునోదకాది సంయుక్తం య: ప్రాపద్యాత్ గవాహ్నికమ్/ సోశ్మెధ సమం పుణ్యం లభతే నాత్ర సంశయ: // ( బృహత్ పరాశర స్మృతి ) ప్రతి దినము గోవులకు నీరు త్రాగించి , గడ్డిని మేతగా తినిపించే వారికి అశ్వమేధ యాగం చేసిననంత పుణ్యం వస్తుంది .
ఇందులో కించత్తు కూడా సందేహం లేదు .
---------------
''కోడి,మేక,లాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి'' అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా.....
గోవు కూడా జంతువే కానీ....
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది.
అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ''గోమాత'' అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.
నీ చదువు...
నీ సంస్కారం...
నీ విచక్షణ...
నీ విజ్ఞత...
నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే...
గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా
* ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని ..
ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.
అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు...ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.
ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ,మూత్రంలోగానీ,పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.
మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?
గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.
* ప్రాణవాయువు(Oxygen )ను పీల్చూకుని ప్రాణవాయువు(Oxygen )ను వదిలే ఏకైక ప్రాణి.
* విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.
* వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.
* ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.
* కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.
* గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.
* గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.
* ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.
* ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.
* ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen )ఉత్పత్తి అవుతుంది.
* గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.
''గోరక్షణ వల్లనే మన జాతి,మన ధర్మము రక్షింపబడును.గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు''.
- గాంధీజీ.
''ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది.దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు''.
- మహ్మద్ ప్రవక్త.
''ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే''.
- ఏసుక్రీస్తు.
''గో క్షీరము గొప్పమందు.దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని.దాని మాంసము రోగకారకము''.
- హజరత్ మహమ్మద్.
''గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము.ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగానుండును.గృహములు ఉన్నతి చెందును.నాగరికత పురోగమించును''.
- బర్మార్డ్ మేక్ ఫెడన్.
''మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు''.
- హకీల హజ్మల్ ఖాన్.
''గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం''.
- తోహస్-వి-హింద్ బిజహరు.
భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?
నువ్వు హిందువైనా, మస్లీమువైనా,క్రిస్టియన్వైనా నాదేశంలో ఉన్నంతవరకూ భారతీయుడివి.
నా దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం.
స్వేచ్ఛంటే....
''నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు''
''నా(నీ,ఈ)దేశం మెచ్చేటట్టు బ్రతకడం''
''వందేగోమాతరం''.



LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list