MohanPublications Print Books Online store clik Here Devullu.com

తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా? | Tirumala hills | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా?  | Tirumala hills | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu



తిరుమల ఏడుకొండల 
పరమార్థం ఏమిటో మీకు తెలుసా?

1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి.

ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.

అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రి ర్గరుడాచలః |
తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః

ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండీ విముక్తులు కాగలరు.

తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా?  | Tirumala hills | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

1. వృషభాద్రి :- అంటే ఎద్దు : వ్రుశాభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)
వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము

వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.

2. వృషాద్రి :- అంటే ధర్మం : ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను, పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు.
అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం.

3. గరుడాద్రి :- అంటే పక్షి - ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం.
షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి.
పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది.
ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు.
భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
అన్ == ఉన్నవాడు, కళ్యాణగుణ సహితుడు, హేయగుణ రహితుడు.
అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.

తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా?  | Tirumala hills | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక.
ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే.
అప్పుడు అంజనాద్రి దాటతాడు.

5. శేషాద్రి :- ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు, తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు)
తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.

తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా?  | Tirumala hills | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

6. వేంకటాద్రి :- వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసినవారు పిచ్చివాళ్ళలా కనవడుతారు. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు.
ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.

7. నారాయణాద్రి :- అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి.

వేంకటాచలంలో ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుకుకోవడం ఏడు కొండలు ఎక్కడం.

బరువు తగ్గండీ | Weight Loss Together | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu


బరువు తగ్గండీ | Weight Loss Together | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Obesity Weight Loss Losing weight couple weight loss made for eachother


బరువు తగ్గండీ

పొద్దున్నే నిద్రలేచి వ్యాయామం చేస్తానంటారు... కానీ చేయరు! కొవ్వుపదార్థాలు మానేస్తాననీ చెబుతారు... కానీ నాన్‌లూ, పిజాలూ, బర్గర్‌లు లాగించేస్తారు. వేళకు నిద్రపొమ్మంటే... కంప్యూటరు ముందునుంచీ కదలరు. కూరల్లో కాస్త ఉప్పు తగ్గిస్తే... ఏంటీ చప్పిడి తిండి అంటూ కోప్పడతారు... ఇలా శ్రీవారి బరువుకు సంబంధించిన కథల గురించి ఎన్నయినా చెప్పేస్తారు చాలామంది మహిళలు. అలా బాధపడటం కన్నా... తన బరువును తగ్గించే ప్రయత్నం ఎందుకు చేయకూడదు. దానివల్ల మనమూ సన్నబడొచ్చు. అదెలా అంటారా... చదవండి మరి.
పెళ్లికి ముందు...ఫిట్‌గా ఉండాలీ, అందంగా కనిపించాలి, పిడికెడు పొట్ట కూడా ఉండకూడదు... అని అమ్మాయిలే కాదు, అబ్బాయిలూ ఆలోచిస్తారు. దానికి సంబంధించి తీసుకునే జాగ్రత్తలూ, పాటించే కొత్తకొత్త నియమాల జాబితా చాంతాండంత ఉంటుంది. తీరా పెళ్లయ్యాక ఉద్యోగం, కుటుంబం, పిల్లలూ, ఆలస్యంగా పడుకోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం... అన్నీ కలిపి బరువు పెంచేస్తాయి. అవే క్రమంగా అనారోగ్యాలూ, వైవాహిక జీవితంలో సమస్యలు తెచ్చి... మానసిక కుంగుబాటుకు దారి తీస్తాయి. శ్రీవారి బాగోగులు చూసే ఇల్లాలిగా.. వారి ఆరోగ్యం కూడా స్త్రీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఛలో సన్నబడదాం..’ అంటూ ఆయన్నీ ప్రోత్సహించండి. ముందుగా...
మానసికంగా సిద్ధం చేయండి...
చాలామంది మహిళలు చేసే పొరపాటు ‘మీరు బరువు తగ్గాల్సిందే. అవి తినొద్దూ.. ఇవి తినొద్దూ’ అని ఆర్డర్లు వేసేస్తుంటారు. దీంతో రకరకాల ఒత్తిళ్లలో ఉన్న మగవారు ఈ విషయాన్ని ప్రతికూలంగా తీసుకుంటారు. గట్టిగా దబాయింపుగా చెప్పడాన్ని మాత్రమే వారు పట్టించుకుంటారు గానీ.. అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తుంటారు. కొందరు అనుకుంటారు కానీ ఆరంభంలోనే ఆగిపోతారు. ‘తను చెబితే నేను చేయాలా... నాకు తెలియదా ఎప్పుడు ఏం చేయాలో...’ అనే ధోరణిలో తమ ఆరోగ్యాన్నీ, ఫిట్‌నెస్‌ని నిర్లక్ష్యం చేసేవారూ ఉంటారు. కాబట్టి భర్త బరువు తగ్గాలి అనుకుంటే.. ముందు మానసికంగా సిద్ధం చేయాలి. పెళ్లికి ముందు ఫొటోలు చూపించి.. ‘మళ్లీ మనం ఇలా ఎప్పుడవుదాం..’ అని అడిగి చూడండి. కలిసి వ్యాయామం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం, చిలిపి సవాళ్లు విసరడం.. వంటివి శ్రీవారిని తప్పకుండా ఆ దిశగా ప్రేరేపిస్తాయి. భార్యాభర్తలు కలిసి వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఒకరినొకరు స్ఫూర్తి పొందుతూ ముందుకు సాగొచ్చు. పార్టనర్‌ యోగా, పార్టనర్‌ ఏరోబిక్స్‌, పార్టనర్‌ ఎక్సర్‌సైజెస్‌, పార్టనర్‌ ఫిట్‌నెస్‌... ఇలా రకరకాలుగా ప్రయత్నించొచ్చు. ఇంటికి దగ్గరలోని పార్కుకో, మైదానానికో ఇద్దరూ కలిసి ఉదయం నడకకు వెళ్లొచ్చు. తాడాట ఆడొచ్చు. గోడ కుర్చీలు వేయొచ్చు. స్క్వాట్స్‌ను ప్రయత్నించొచ్చు. ట్రైనర్‌ను పెట్టుకుని ఇద్దరూ కలిసీ వ్యాయామాలు చేయొచ్చు అంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణురాలు మణిపవిత్ర.



అప్పుడేం చేయాలంటే..
* మీరు కావచ్చు, ఆయన కావచ్చు... అప్పటివరకూ జీవనశైలిలో చేసిన పొరపాట్లన్నీ ఓ జాబితాగా రాసుకోవాలి. ఇక మీదట చేయాల్సిన నియమాలను మరో కాగితంపై రాయాలి. చేయకూడనివి రెడ్‌ మార్కర్‌తో కొట్టేసి చేయాల్సినవి గ్రీన్‌ మార్కర్‌తో టిక్‌ చేయాలి. ఆ జాబితాను ప్రతిరోజూ ఇద్దరూ చూసేలా ఒక చోట అంటించుకోవాలి. అలా చూడటం వల్ల మెదడులో చేయాలన్న స్ఫూర్తి పెరుగుతుంది.
* నిపుణుల్ని సంప్రదించి బరువు తగ్గడానికి ఎలాంటి నియమాలు పాటించాలన్నదీ ఓ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆహార నియమాలూ, చేయాల్సిన వ్యాయామ ప్రక్రియ గురించి రాసుకోవాలి. ఎలా చేయాలన్నది మాట్లాడుకోవాలి. ఒక్కరి నిర్ణయమం మీదే వెళ్లడం సరికాదు.
* ఇద్దరూ కలిసి ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. కలిసి వ్యాయామ సాధన చేయడం, అల్పాహారం తీసుకోవడం మొదలుపెట్టాలి. వీలుంటే మిగతా సమయాల్లోనూ కలిసి తినడానికి ప్రాధాన్యమివ్వాలి.
* రోజూ ఒకే రకమైన వ్యాయామ సాధనలు కాకుండా ఒక రోజు నడకా, మరోరోజు జాగింగ్‌.. ఇలా రోజూ వ్యాయామ సాధనలో కొత్తదనం ఉండేలా ప్రణాళిక వేయాలి. ఈ రోజుల్లో ఇద్దరూ కలిసి చేసే యోగాసనాలు ఉన్నాయి. అలా ఇద్దరూ కలిసి చేయడం వల్ల ఫలితాలు చాలా త్వరగా ఉంటాయని చెబుతున్నారు యోగా నిపుణులు.
* ఒక వేళ మీ శ్రీవారు బద్ధకించినా గట్టిగా అరవడం, విసురుగా మాట్లాడటం, కోప్పడటం సరికాదు. నియమాలు పాటించడంలో వెనకబడినా, ఒకరోజు బద్ధకించినా తేలిగ్గానే తీసుకోవాలి తప్ప సహనం కోల్పోకూడదు.
సరదా సరదాగా..
వ్యాయామం, బరువు తగ్గడం, డైటింగ్‌ వంటి మాటలు మనసులోంచి తీస్తే చాలా మంచిది. ఇద్దరూ కలిసి వ్యక్తిగత సమయం కేటాయించుకుంటున్నాం అని భావిస్తే చాలా బాగుంటుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి సరదాగా ఈత తరగతులకు వెళ్లడం, సైక్లింగ్‌ చేయడం, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌ వంటివి ఆడొచ్చు. చిన్నారుల్లా మారి.. ఎంత హడావుడిగా ఉన్నా.. రోజులో ఎంతో కొంత సమయం ఇలా గడపడం వల్ల ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుందో.. మానసికంగానూ అంతే ప్రయోజనం ఉంటుంది. పైగా ఇద్దరి మధ్యా అనుబంధం అంతకుముందు కంటే మెరుగ్గా ఉంటుంది. దాంతోపాటు కొత్త జంటలా మారిపోయి.. ఏరోబిక్స్‌, జుంబా, సల్సా వంటి నృత్య రీత్యుల్ని నేర్చుకోవడం మొదలు పెట్టొచ్చు. వీటన్నింటి వల్ల కెలొరీలు అధిక మొత్తంలో ఖర్చు అవుతాయి. నిద్రలేమి సమస్యలూ దూరమవుతాయి.


వంటింట్లో చేయాల్సిన మార్పులు...

* బరువు తగ్గడానికి పూర్తిగా పొట్ట మాడ్చుకోవాల్సిన అవసరంలేదు. మాంసకృత్తులూ, పిండిపదార్థాలు శరీరానికి అందాలి. పిండిపదార్థాలు అంటే అన్నం, బ్రెడ్‌ నుంచి అందేవి కాకుండా సంక్లిష్ట పిండిపదార్థాలు ఎంచుకునేలా చూసుకోవాలి. అంటే బ్రౌన్‌రైస్‌, తృణధాన్యాలూ, ఓట్స్‌ వంటి వాటితో చేసిన పదార్థాలు అన్నమాట. వీటిని కూడా మితంగా తీసుకోవాలి. వీటిల్లో పీచు ఉండటమే కాదు... అరగడానికీ ఎక్కువ సమయం పడుతుంది.
* మాంసాహారం దూరంగా పెట్టాల్సిన పనిలేదు. మీ వారికి ఎక్కువగా తినే అలవాటు ఉంటే పూర్తిగా మానేయమనకుండా ఆ పరిమాణం తగ్గిస్తూ రావాలి. బదులుగా మీల్‌మేకర్‌, స్కిన్‌లెస్‌ చికెన్‌ ఎంచుకోవచ్చు. అంతేకానీ అలవాటు లేని బ్రకోలీ, లెట్యూస్‌ వంటివి శ్రీవారికి వడ్డించేయడం సరికాదు.
* తీపి పదార్థాలు బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే మిఠాయిలను మాత్రం ఎంత తగ్గిస్తే అంత మంచిది. బదులుగా తేనె, తాజా పండ్లూ, ఖర్జూరాలూ, ఎండు ద్రాక్ష వంటివి ఇవ్వొచ్చు. వీటితో చేసిన స్వీట్లు కూడా ఆరోగ్యానికి మంచిదే.
* రెస్టారంట్లూ, రోడ్డువారల ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టేయడం మంచిది. మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. పండ్ల రసాలకు బదులు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. కీరదోస, క్యారెట్‌, బీట్రూట్‌, టోఫూతో సలాడ్లు చేయడం మంచిది. నూనె, ఉప్పూ ఎంత తక్కువ తీసుకుంటే అంత త్వరగా ఫలితం ఉంటుంది.
* అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. రాజ్మా, పెసలూ, బఠాణీ, సెనగలూ, గుడ్లూ, సోయా, పల్లీలూ... ఇవన్నీ మనం తీసుకునే భోజనంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. వీటిలోని మాంసకృత్తులు శరీరానికి శక్తిని అందిస్తాయి.
* కాఫీ, టీలు తాగినా చక్కెర్లకు దూరంగా ఉండాలి. వాటితోపాటు ఉదయం, సాయంత్రం గ్రీన్‌ టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడంలోనే కాదు.. శరీరంలోని విషవ్యర్థాలను బయటకు పంపడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి అంటున్నారు పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ లతాశశి.

నీలి తెరల మధ్య చిక్కుకున్న మనిషి | Blue Light Effect on Eye | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu

నీలి తెరల మధ్య  చిక్కుకున్న మనిషి | Blue Light Effect on Eye | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Retina Eye effect eye syndromes Mobile PC Tablet Blue light life generations

నీలి తెరల మధ్య 
చిక్కుకున్న మనిషి! 



‘తెర’ జీవితాలంటే సాధారణంగా సినిమా నటులవే అనుకుంటుంటాం గానీ వాస్తవంలో ఇప్పుడు మనందరివీ ‘తెర’ జీవితాలే! లేస్తూనే మొబైల్‌ ముఖం చూస్తాం. ఇంట్లో, ఆఫీసులో కంప్యూటర్ల ముందే పని. కాస్త సమ యం చిక్కితే టీవీకి అతుక్కుపోతాం. ప్రయాణాల్లోనూ మొబైళ్లు, ట్యాబ్లెట్లే. ఇలా మన జీవితంలో అత్యధిక భాగం ఏదో ఒక ‘తెర’ ముందే గడిచి పోతోంది. మన జీవితాల్లో ఈ ‘స్క్రీన్‌ టైమ్‌’ అన్నది సగటున రోజులో 6 గంటలకు పైగా ఉంటోంది. ఈ స్క్రీన్‌లన్నింటి నుంచీ వెలువడే నీలి కాంతి (బ్లూ లైట్‌) మన కంటికీ, ఒంటికీ కూడా సమస్యలు తెచ్చిపెడుతోందని పరిశోధనా రంగం గుర్తించింది. దీన్నుంచి తప్పించు కోవటం తక్షణావసరమనీ హెచ్చరి స్తోంది. మరి మనల్ని పూర్తిగా ఆవరించిన ఈ ‘నీలి విప్లవాన్ని’ మనం ఎదుర్కొనేదెలా? భయపెడుతున్న నీలి కాంతి!
ఒకప్పుడు పగలంతా పనులు చేసుకునే వాళ్లం.
పొద్దుగూకుతూనే పడుకునేవాళ్లం. అంతే!
అది సహజమైన జీవనశైలి. సూర్యుడొక్కడే మనకు కనిపించే కాంతి. మనుషులూ ఆయనతోనే లేచేవారు, ఆయనతో పాటే విశ్రమించేవాళ్లు. మనిషీ ప్రకృతీ మమేకమై నడిచిన రోజులవి. కానీ ఇప్పుడు రాత్రికి అర్థం మారిపోయింది. పగటికంటే రాత్రి మిరుమిట్లు ఎక్కువై పోతున్నాయి. రాత్రి జీవితం పగటికంటే సుదీర్ఘమైనదిగా కూడా తయారవుతోంది. దీన్ని మన ఘనతగా చెప్పుకొంటున్నాంగానీ దీనికి మనం చెల్లిస్తున్న మూల్యం కూడా ఎక్కువేనని వైద్యరంగం ఇప్పుడిప్పుడే స్పష్టంగా గుర్తిస్తోంది. రాత్రి కృత్రిమ కాంతులు చూసి మన మెదడు భ్రమపడుతోంది. ఏది శ్రమించే సమయమో, ఏది విశ్రమించే సమయమో తెలియక గందరగోళపడుతోంది. ఇది ఒక సమస్య అయితే .. మన చుట్టూ ఉన్న కృత్రిమ కాంతిలో ఉండే ‘బ్లూ లైట్‌’ వల్ల కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయని పరిశోధనా రంగం గట్టిగా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా మనం రోజంతా మొబైల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ట్యాబ్లెట్ల వంటి డిజిటల్‌ తెరల ముందర గడుపుతుండటం వల్ల తీవ్ర అనర్ధాలు సంప్రాప్తిస్తున్నాయి. దీన్ని గర్తించి జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి అని హార్వర్డ్‌తో సహా ప్రపంచ పరిశోధకులంతా నొక్కి చెబుతున్నారు.

నీలికాంతి ప్రభావం మన మీద
ఎలా ఉంటుందో తెలుసా?
* ప్రధానంగా ఈ నీలి కాంతి మన నిద్రను ప్రభావితం చేసే మెలటోనిన్‌ అనే హార్మోను ఉత్పత్తిని, విడుదలను ప్రభావితం చేస్తుంది. దీంతో ‘నిద్ర-మెలకువ’లను నియంత్రించే సర్కాడియన్‌ రిథమ్‌ అస్తవ్యస్తమవుతోంది. ఇతర హార్మోన్లూ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
* నీలికాంతి నేరుగా కంటిలోని రెటీనా పొర మీద పడుతుంది. ఫలితంగా రెటీనా పొర బలహీనపడి చూపు సమస్యలు తలెత్తుతున్నాయి.
మన కనుగుడ్డులో వెనక భాగాన ఉండే ‘రెటీనా’ పొర అత్యంత సున్నితమైనది. దీనికి ప్రమాదకరమైన కాంతి సోకటం మంచిదికాదు. అతినీలలోహిత కిరణాల వంటివాటిని మన కను గుడ్డు మీద ముందుండే తెల్లటి కార్నియా పొర, దాని వెనక ఉండే కటకం (లెన్సు) చాలా వరకూ అడ్డుకుంటాయి. కానీ అవి బ్లూలైట్‌ను మాత్రం ఆపలేవు. దీంతో బ్లూ లైట్‌ నేరుగా కంటిలోకి వెళ్లి సున్నితమైన రెటీనా మీద పడి, దాన్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలం ఈ కాంతికి ప్రభావితమైతే చూపు కన్ను, చూపు యంత్రాంగం మొత్తం అలసిపోతోంది. చూపు మందగిస్తుంది. దీన్నే ‘డిజిటల్‌ ఐ స్ట్రెయిన్‌’ అంటారు. డిజిటల్‌ స్క్రీన్లు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా, స్పష్టంగా ఉండేందుకు ఎల్‌ఈడీ తెరలను (బ్యాక్‌ లిట్‌ ఎల్‌ఈడీ) ఎక్కువగా వాడుతున్నారు. వీటి నుంచి చాలా శక్తిమంతమైన నీలికాంతి వెలువడుతుంది. ఇప్పుడు స్క్రీన్లు అన్నింటా దీన్నే విరివిగా వాడుతుండటం వల్ల మన కంటికి ఈ బ్లూలైట్‌ తాకిడి మరింత ఎక్కువైపోతోంది. రోజూ డిజిటల్‌ పరికరాలు వాడుతున్న వారిలో దాదాపు 70% మంది దీనికి సంబంధించిన ఏదో లక్షణాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు మనల్ని ఆకట్టుకుంటున్న ఎల్‌ఈడీ వంటి మిరుమిట్లు గొల్పుతున్న లైట్లన్నింటి నుంచీ కూడా ఈ నీలికాంతి వెలువడుతుంటుంది.
ఏమిటీ నీలి కాంతి?
కాంతి అంటే మనం ఏమో అనుకుంటాంగానీ.. వాస్తవానికి అది విద్యుదయస్కాంత అణువుల ప్రవాహం! ఈ అణు ప్రవాహం తరంగాల రూపంలో ఉంటుంది. అలాగే మనం మనం కంటికి కనిపించేదే కాంతి అనుకుంటాంగానీ.. వాస్తవానికి కాంతిని విశ్లేషించి చూస్తే దానిలో మన కంటికి కనిపించేది కొంత భాగమే. గామా కిరణాలు, ఎక్స్‌-కిరణాలు, అతినీల లోహిత (యూవీ) కిరణాలు, పరారుణ (ఇన్‌ఫ్రారెడ్‌) కిరణాలు.. ఇలా కాంతిలో చాలా ఉంటాయి కానీ అవన్నీ మన కంటికి కనిపించవు. కాంతి వర్ణ పటంలో మన కంటికి కనిపించేది.. ఇంద్రధనస్సులో ఉన్నట్టు ఏడు రంగులుండే (ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం మొ।।) భాగం మాత్రమే. ఈ కనిపించే రంగులన్నింటిలోకీ చాలా ప్రత్యేకమైనది నీలి రంగు. ఇది అత్యధిక శక్తిని విడుదల చేస్తుంది. అందుకే మన మీద దీని ప్రభావం చాలా ఎక్కువ. ఈ ‘బ్లూ లైట్‌’ వెలుతురు అంతటా ఉంటుంది. సూర్యకాంతిలో కూడా ఉంటుంది. కాకపోతే పగటిపూట ఈ కాంతి వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది. అది మనలో చురుకుదనాన్ని పెంచుతుంది. స్పందనలను, భావోద్వేగాలను మెరుగుపరుస్తుంది. ఇంత వరకూ మంచిదే. కానీ ఈ బ్లూలైట్‌ మన సెల్‌ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్‌ నోట్‌బుక్స్‌ వంటి డిజిటల్‌ తెరల నుంచి, అలాగే ఎల్‌ఈడీ, ఫ్లోరసెంట్‌ లైట్ల నుంచి కూడా విడుదల అవుతుంటుంది. కావటానికి సూర్యకాంతితో పోలిస్తే వీటి నుంచి వెలువడేది తక్కువే. కానీ మనం రోజంతా అధిక సమయం ఈ స్క్రీన్ల మధ్యే, వీటికి దగ్గరగా గడుపుతుండటం, రాత్రిపూట కూడా వీటితోనే సాంగత్యం చేస్తుండటం వల్ల ఇప్పుడు ఈ నీలి కాంతే ప్రమాదకరంగా పరిణమిస్తోంది.
కానీ ఈ పరికరాలు వాడకుండా నేటి మన జీవితాన్ని ఊహించటం కూడా కష్టం. అందుకే ఇప్పుడు ‘బ్లూ లైట్‌’ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఎక్కువ అవుతోంది.
తెరల మధ్యే తెల్లవారుతోంది!
ఉదయం లేస్తూనే మొబైల్‌ చూడటంతో మొదలయ్యే మన జీవితం రోజంతా డిజిటల్‌ స్క్రీన్ల మధ్యే గడిచిపోతోంది. ఇలా రోజులో అధిక భాగం ఏదో ఒక డిజిటల్‌ స్క్రీన్‌ను, చాలా దగ్గర నుంచి చూస్తుండటం క్రమేపీ పెద్ద ఆరోగ్య సమస్యగా తయారవుతోందని, దీనివల్ల ఒకప్పటి కంటే ఇప్పుడు కంటి వ్యాధులు, నిద్ర సమస్యలు పెరిగిపోతున్నాయని పరిశోధకులు గుర్తించారు.
ప్రపంచ వ్యాప్తంగా 60% జనాభా రోజులో 6 గంటల కంటే ఎక్కువ సమయమే డిజిటల్‌ తెరల ముందు గడుపుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కుర్రకారు సగటున రోజులో 1012 గంటలకు పైగా ఈ స్క్రీన్స్‌తో గడుపుతున్నారు. రోజూ డిజిటల్‌ పరికరాలు వాడుతున్న వారిలో 70% మంది దీనికి సంబంధించిన ఏదో లక్షణాలతో సతమత మవుతున్నారు.



కథ కాదు జీవితం | Biopics Of Legends | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu


కథ కాదు జీవితం | Biopics Of Legends | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Cinema Tollywood Bollywood Hollywood Mahanati Savitri Ntr biopic Ysr biopic Kcr biopic sanjayduth biopic


కథ కాదు జీవితం



వారి జీవితాలు భావి తరాలకు స్ఫూర్తినిచ్చే గ్రంథాలు. విజయ తీరాలను చేరిన వారు కొందరైతే.. విజయాన్ని అర అంగుళం తేడాతో వదులుకున్న వాళ్లు మరికొందరు. అయినా వాళ్లు విజేతలే. ఎందుకంటే, ఎన్నో లక్షల హృదయాలను వారు గెలిచారు. ఆశయాల కోసమే అడుగులేశారు వాళ్లు. వారి గుర్తులు, వారి స్ఫూర్తి ఛాయలు మన మీద నిత్యం ప్రసరిస్తూనే ఉంటాయి. తరతరాలుగా మరిచిపోలేని వారిచ్చిన స్ఫూర్తి ముందు తరాలకు అందించడానికి వారి జీవిత చరిత్రలు సినిమాలుగా వస్తున్నాయి. ఆ వివరాలతో ఈ వారం కవర్‌స్టోరీ..
ప్రవీణ్‌కుమార్ సుంకరి

బయోపిక్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్నవేం కాదు. సినిమా బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఉన్నప్పటి నుంచే బయోపిక్స్ హవా మొదలైంది. కాకపోతే ఆ మధ్యలో కొన్ని రోజులు చిన్న బ్రేక్ వచ్చింది. కొంతకాలం తర్వాత కాసిన్ని కమర్షియల్ హంగులు, కొన్ని ఊహాత్మక ఘటనలు కలిపి కొత్తగా జనాల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. పలు రంగాల్లో విజయవంతంగా రాణించిన వారి జీవితాల గురించి, తెలియని కోణాల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత అందరికీ ఉంటుంది. పక్కవారి జీవితం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం మానవ సహజ గుణం. అలాంటిది సెలబ్రిటీల జీవితాల గురించి తెలుసుకోవడమంటే మరింత ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ కోణంలోనే బయోపిక్‌లకు ఎనలేని ఆదరణ లభిస్తున్నది. అందులో అభిమాన నటులు, ఆటగాళ్లు, నాయకుల కథలైతే తెరమీద విజయ విహారం చేస్తాయి. ప్రేక్షకుల నుంచి విజిల్స్, నీరాజనాలు అందుకుంటాయి.

కేసీఆర్ బయోపిక్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించి స్వరాష్ట్రం సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవితాన్ని సినిమాగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు మధురా శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడుపడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం వంటి ఘట్టాలతో ఈ బయోపిక్ ఉండనున్నది. అయితే.. కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు.

అనగనగా ఓ రాకుమారుడు (కత్తి కాంతారావు బయోపిక్) : కత్తియుద్ధాల హీరో కత్తి కాంతారావు జీవితం కూడా మరికొన్ని రోజుల్లో బయోపిక్ రూపంలో తెరమీద ఆవిష్కృతం కానుంది. ఆయన సినిమాల్లో అరంగేట్రం నుంచి ఎన్టీఆర్, ఎంజీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్రనటుల సమకాలీనుడిగా నిలబడిన ప్రస్థానాన్ని ఈ బయోపిక్‌లో చూపించనున్నారు. ఈ సినిమాకు పి.సి ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. నిర్మాతగా, నటుడిగా ఆయన ప్రస్థానం ఈ సినిమాలో చూపించనున్నారు. ఆయనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఆయన స్వస్థలమైన కోదాడలోని గుడిబండ వెళ్లి ఆయన పుట్టి, పెరిగిన ఇల్లు, ఆయన గురించి తెలిసిన వ్యక్తుల నుంచి సమాచారం సేకరిస్తున్నాడు దర్శకుడు పీసీ ఆదిత్య.

గోపీచంద్ బయోపిక్ : ఎంతోమంది గ్రామీణ క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేసిన బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్. ఆయన జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కనున్నది. ఈ బయోపిక్‌కి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నాడట. గోపీచంద్‌గా సుధీర్ బాబు నటించనున్నాడు. ఈ ఏడాది నవంబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు వెండి పతకం గెలువడంతో గోపీచంద్ పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఈ తరుణంలో ఆయన జీవితం గురించి, బాడ్మింటన్ ఆటలో తన ప్రస్థానం గురించి బయోపిక్ ప్రకటన వచ్చింది.

సంజు (సంజయ్‌దత్ బయోపిక్) : బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ జీవితాన్ని కూడా బయోపిక్ రూపంలో తెరకెక్కించారు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్‌లో సంజయ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించాడు. డ్రగ్స్‌కి బానిస కావడం, లవ్ ఎఫైర్స్, టాడా కేసులో జైలు జీవితం అనుభవించిన ఘటనలను సినిమాలో చూడొచ్చు. ఈ ఏడాది జూన్ 29న ఈ సినిమా విడుదల కానున్నది.


అభినవ్ బింద్రా బయోపిక్ : భారత షూటర్ అభినవ్ బింద్రా జీవితాన్ని బయోపిక్ రూపంలో తెరకెక్కిస్తున్నాడు బాలీవుడ్ డైరెక్టర్ కణ్ణణ్ అయ్యర్.


ఆనంద్‌కుమార్ బయోపిక్ : ఐఐటీ- జెడ్‌ఈఈ ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారికి ఈయన సుపరిచితుడు. గొప్ప మ్యాథమెటీషియన్. సూపర్ 30 పేరుతో దిగువ మధ్యతరగతిలో ఉన్న 30మందిని సెలెక్ట్ చేసుకొని వారికి ఈ ఎంట్రన్స్ పరీక్షలకు శిక్షణ ఇస్తుంటాడు. ఈయన బయోపిక్ ఆధారంగా వస్తున్న సినిమాలో హృతిక్‌రోషన్ నటిస్తున్నాడు. కాగా, ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో షకీలా బయోపిక్ త్వరలో రానున్నది. ఈ బయోపిక్‌లో షకీలా పాత్రలో రిచా చడ్డా నటించనున్నది. సిల్క్‌స్మిత హవాను తట్టుకొని షకీలా ఇండస్ట్రీలో ఎలా సక్సెస్ అయిందో ఈ సినిమా ద్వారా చూపించనున్నారు. బాలల హక్కుల కోసం పోరాడుతూ నోబెల్ బహుమతి అందుకున్న కైలాష్ సత్యార్థి జీవితం కూడా బయోపిక్ రూపంలో తెరకెక్కున్నది. కైలాష్ సత్యార్థి పాత్రలో బొమన్ ఇరానీ కనిపించనున్నాడు. అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ జీవితం కూడా బయోపిక్ రూపంలో తెరకెక్కనున్నది. ఈ చిత్రంలో రాకేష్ శర్మ పాత్రలో ఆమిర్‌ఖాన్ నటిస్తున్నాడు. 83 పేరుతో కపిల్‌దేవ్ బయోపిక్ తెరకెక్కుతున్నది. 1983లో ఇండియాకు క్రికెట్‌లో కప్ సాధించిపెట్టిన ఘట్టం నుంచి ఈ కథ మొదలవుతుంది. ఈ బయోపిక్‌లో కపిల్‌దేవ్ పాత్ర రణ్‌వీర్ సింగ్ పోషించనున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా విడుదల కానున్నది.



సన్నీలియోన్జీ టీవీ గ్రూప్ నిర్మాణ సారథ్యంలో ఈ బయోపిక్ రానున్నది. పోర్న్ రంగంలోకి వెళ్లిన తర్వాత, వెళ్లక ముందు తన జీవితం ఎలా ఉండేది అనే కోణంలో సన్నీ లియోన్ జీవితాన్ని చూపించనున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో సన్నీలియోన్‌గా పేరు మార్చుకొని పోర్న్ రంగంలోకి ప్రవేశించిందో, అందులోంచి బయటకు వచ్చి రెగ్యులర్ సినిమాల్లో అవకాశాలు అందుకొని రాణిస్తున్న క్రమాన్ని ఈ బయోపిక్‌లో చూపించనున్నారు. తన శృంగార సినిమాలతో ఎంతోమంది యువకుల గుండెలు దోచుకున్న ఈమె పాత్రను ఎవరు పోషిస్తున్నారన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు.



యాత్ర : కడప దాటి ప్రతీ గడపలోకి వస్తున్నాను. మీతో కలిసి నడువాలనుంది. మీ గుండె చప్పుడు వినాలని ఉంది అనే నినాదంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర విశేషాలను, ఆయన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ఇది. ఇందులో వైఎస్సార్‌గా మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఇప్పటికే విడుదలైంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానున్నది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితంలోని ప్రధాన ఘట్టాలను మహీ వీ రాఘవ్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. వైఎస్‌ఆర్‌గా కనిపించనున్న మమ్ముట్టి వేషధారణ, నడక, మాటలు అన్నీ వైఎస్‌ఆర్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంటాయంటున్నారు చిత్రబృందం. ఈ సినిమాలో జగన్ పాత్రలో సూర్య, షర్మిల పాత్రలో భూమిక కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.


ఎన్టీఆర్ బయోపిక్ : బాలకృష్ణ నిర్మిస్తున్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) బయోపిక్ సంక్రాంతికి విడుదల కానున్నది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడైన బాలకృష్ణే పోషించనున్నాడు. ఎన్టీఆర్ సినిమా ప్రస్థానం నుంచి ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన ఘట్టాలను ప్రధానంగా తీసుకొని ఈ బయోపిక్ నిర్మిస్తున్నారు.
నిర్మాణంలో ఉన్న మరికొన్ని బయోపిక్స్ :జార్జిరెడ్డి, శ్రీదేవి (బోనీ కపూర్ నిర్మిస్తున్నట్టు ప్రకటించాడు), దాసరి, సౌందర్య, జయలలిత, సైరట్ దర్శకుడు అమితాబ్‌తో ఒక బయోపిక్.



ఏ పాత్రకు.. ఎవరు?బయోపిక్‌ల హవా నడుస్తున్న ఈ సీజన్‌లో మరిన్ని బయోపిక్‌లు వచ్చే అవకాశం ఉంది. సావిత్రిగా మెప్పించి కీర్తి సురేష్ ప్రశంసలందుకుంటున్నది. ఎవరి బయోపిక్‌కి ఎవరైతే బాగుంటుందో సరాదాగా ఓ లుక్కేద్దామా!


సాహసమే..ప్రముఖుల జీవితాలను తెరకెక్కించాలంటే అదో సవాల్. వారి జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలను ఎక్కడా తేడా రాకుండా తెరకెక్కించాల్సి ఉంటుంది. వాస్తవ జీవితాన్ని అచ్చం అలాగే చూపించాల్సి ఉంటుంది. తెర మీద చూస్తున్న సీన్లు సదరు కథకు చెందిన వ్యక్తి కాలంలోకి తీసుకెళ్లగలగాలి. ఇదంతా సాధ్యం కావాలంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించగలగాలి. అందుకు చాలా పరిశోధన చేయాల్సి ఉంటుంది. వాస్తవాన్ని సినిమాటిక్‌గా, ఆసక్తికరంగా చూపించగలగాలి. ఎవరి జీవితాన్నైతే సినిమాగా తీస్తున్నామో ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా ఆసక్తికరంగా మలచాలి. ఎవరినీ నొప్పించకుండా అందరినీ మెప్పించాలి. వాస్తవాన్ని ఎక్కడా వక్రీకరించకూడదు. ఊహాజనిత ఘటనలు తెరకెక్కించకూడదు. కొన్నిసార్లు ఆ వ్యక్తికి సంబంధించిన కొన్ని మైనస్ పాయింట్స్ చూపించకుండా ఉండాల్సి ఉంటుంది. ప్రపంచానికి తెలియని పాజిటివ్ కోణాన్ని, తెలియని ఆసక్తికర విషయాలను చెప్తే ఆదరణ పెరుగుతుంది.
ఎందుకింత డిమాండ్..దర్శకుడి ఊహల్లో పుట్టిన కథలు, తెరకెక్కిస్తే అప్పట్లో జనాలు విరగబడి చూశారు. సినిమా చూసే ప్రేక్షకులు, సినిమా చూపే దర్శకుల ఆలోచనా విధానం కూడా మారుతున్నది. పాత కథలకు కాలం చెల్లింది. గత 15ఏళ్లుగా బయోపిక్స్ ప్రస్థానం మొదలైంది. నిజ జీవితాలను, వాస్తవ ఘటనలను ఆధారంగా తీసుకొని సినిమాగా రూపొందిస్తున్నారు. తెరపై విరగబూసే కథలన్నీ ఇప్పుడు నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటున్నాయి. చాలా సందర్భాల్లో నిజ జీవితాలే సినిమా కథలుగా తెరకెక్కుతున్నాయి. బయోపిక్‌లో ఒక వ్యక్తి జీవితంలో జరిగిన వాస్తవాలుంటాయి. రియాలిటీ ఉంటది. అందరికీ తెలిసిన, విన్న ఘటనలు ఉంటాయి. అవన్నీ ప్రత్యక్షంగా చూసిన అనుభవం బయోపిక్‌లో దొరుకుతుంది. అప్పటికే ఒకసారి సదరు వ్యక్తి జీవితం గురించి తెలిసిన వారికి మరోసారి, తెలియని వారు ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్నిచ్చే బయోపిక్‌లకు అందుకే ఇంత ఆదరణ లభిస్తున్నది. సోషల్ మీడియా, టీవీ షోలు మనిషిని రియాలిటీకి దగ్గర చేస్తున్నాయి. అందుకే తెరమీద కూడా రియాలిటీని కోరుకుంటున్నారు.
అలరించిన బయోపిక్స్ మహానటిలీడ్‌రోల్ : కీర్తి సురేష్, నిర్మాత : స్వప్న దత్, ప్రియాంక దత్, దర్శకత్వం : నాగ్ అశ్విన్,


వంగవీటిలీడ్‌రోల్ : శాండీ,
నిర్మాత : దాసరి కిరణ్‌కుమార్,
దర్శకత్వం : రాం గోపాల్ వర్మ
సచిన్... ఎ బిలియన్ డ్రీమ్స్లీడ్‌రోల్ : సచిన్ టెండుల్కర్,
నిర్మాత : రవి భాగ్‌చంద్కా,
దర్శకత్వం : జేమ్స్ ఎర్స్‌కిన్


ధోని... ది అన్‌టోల్డ్ స్టోరీలీడ్‌రోల్ : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, నిర్మాత : అరుణ్ పాండే,
దర్శకత్వం : నీరజ్ పాండే,
అజహర్లీడ్‌రోల్ : ఇమ్రాన్ హష్మీ,
నిర్మాణం : సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్,
దర్శకత్వం : టోనీ డిసౌజా
మేరీకోమ్లీడ్‌రోల్ : ప్రియాంక చోప్రా, నిర్మాత : సంజయ్ లీలా భన్సాలీ, అజిత్ అంధరే, దర్శకత్వం : ఓముంగ్ కుమార్
భాగ్ మిల్కా భాగ్లీడ్‌రోల్ : ఫర్హాన్ అక్తర్, దర్శకత్వం : రాకేష్ ఓంప్రకాష్
పూర్ణ లీడ్‌రోల్ : అదితి ఇనందర్
దర్శకుడు : రాహుల్ బోస్
నిర్మాతలు : అమిత్ పట్నీ, రాహుల్ బోస్

ఫైనాపిల్ | Pineapple | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu


ఫైనాపిల్ | Pineapple | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu pineapple health health tips cancer pineapple fruit


ఫైనాపిల్


పైనాపిల్ తింటే.. ఏ పిల్ అవసరం లేదంటారు. అనాస ఆరోగ్యాలకు ఆవాసమని పేరు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, అందాన్ని పెంచే.. ఔషధ గని! కప్పు ముక్కలతో క్యాన్సర్‌కే చెక్ పెట్టొచ్చు.. జ్యూస్ జుర్రుకుంటే ఏ అనారోగ్యాలూ దరిచేరవు. అన్ని ఫైన్ విషయాలు ఉన్న పైనాపిల్‌కి కూడా ఓ రోజుంది.. ఈ నెల 27న ప్రత్యేకంగా పైనాపిల్ డేని జరుపుతున్నారు.ఈ సందర్భంగా పైనాపిల్‌పై ప్రత్యేకంగా ఈ జంటకమ్మ.

ముళ్లతో కాస్త వికారంగా కనిపించినా.. ఔషధాలు మాత్రం మెండు. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రంలో పైనాపిల్‌ని ఎక్కువ పండిస్తారు. ప్రకృతి ప్రసాదించిన అమూల్యఫలం ఇది. దీన్ని అమెరికన్ ఆదివాసులు దేవతాఫలంగా భావిస్తారు. క్రీ.శ.1548 సంవత్సరంలో భారతదేశంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి దీని సాగు దేశీయంగా మొదలయింది. 1 మీటరు నుంచి 1.5 మీటర్ల ఎత్తు వరకు ఇది పెరుగుతుంది. కొంచెం పరిపక్వతకు వచ్చిన తర్వాత పువ్వు వస్తుంది. ఈ పువ్వు సుమారు 15 సెం.మీ.లు ఉంటుంది. పువ్వు 12 నుంచి 20 నెలల తర్వాత పండుగా ఏర్పడుతుంది. వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి.
100గ్రా. పైనాపిల్‌లో ఉండే పోషకాలు.. నీరు : 87.8 గ్రా.
ప్రొటీన్ : 0.4 గ్రా.
కొవ్వు : 0.1 గ్రా.
పిండి పదార్థాలు : 10.8 గ్రా.
క్యాల్షియం : 20 మి.గ్రా.
పాస్ఫరస్ : 9 గ్రా.
ఐరన్ : 2.4 గ్రా.
సోడియం : 34.7 గ్రా.
పొటాషియం : 37 గ్రా.
మాంగనీస్ : 0.56 గ్రా.
కెరోటిన్ : 18 మైక్రో గ్రా.
శక్తి : 46 కిలోక్యాలరీలు
మీకు తెలుసా?- క్రీ.శ.1398లో పైనాపిల్ అనే పేరును అన్నట్లుగా రికార్డులు ఉన్నాయి.
- అమెరికాలో దీన్ని కనుగొన్నారు. యూరోపియన్లు దీనికి పైనాపిల్ అని పేరు పెట్టారట.
- పైనాపిల్ చెట్టు జీవిత కాలం 50 సంవత్సరాలు. కేవలం పైనాపిల్ పై భాగాన్ని కట్ చేసి దాన్ని పాతిపెడితే పైనాపిల్ చెట్టు వస్తుంది.
- ప్రపంచంలోనే అతి పెద్ద పైనాపిల్‌ని 2011లో ఆస్ట్రేలియాకి చెందిన క్రిస్టిన్ మెక్‌కొల్లమ్ పండించాడు. దీని ఎత్తు 32 సెం.మీ.లు బరువు 8.28 కేజీలు.
- 75 శాతం పైనాపిల్‌లో యూరోప్‌లో అమ్ముడుపోతాయి.
n హవాయిలో రికార్డు స్థాయిలో ఈ పంట పండిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొన్ని వందల ఎకరాల్లో పైనాపిల్ సాగు చేస్తున్నారు.
- పైనాపిల్‌ని ఇసుకతో కలిపి మొండి మరకలు ఉన్నచోట రుద్దితే మరకలు మాయమవుతాయి.
- ఆస్ట్రేలియన్ యాసలో ముగింపు పలుకడానికి లేదా చెడు ఒప్పందాలు ఏర్పరుచుకోవడానికి ఒక పదం ఉద్భవించింది. 1930లో బ్రిటన్‌లో బీయింగ్ ఆన్ ద పైనాపిల్ అనే పదం ఒక ప్రెస్‌గా మారింది.
- ప్రపంచం మొత్తం మీద 1/3 పైనాపిల్ పండ్లు హవాయిలో ఉత్పత్తి అవుతాయి.
- ఫ్రూట్‌సలాడ్స్, డ్రింక్స్‌లాగే కాదు.. పైనాపిల్‌తో వైన్‌ని కూడా తయారుచేస్తారు.
ఆరోగ్యం మహాభాగ్యం.. రోజూ ఓ కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే క్యాన్సర్, గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజు మొత్తానికి అవసరమైన
విటమిన్ సి ఈ పైనాపిల్ ద్వారా పొందవచ్చు.

- పైనాపిల్‌లో బ్రొమిలైన్ అనే ప్రొటియోలిటిక్ ఎంజైమ్ ఉంటుంది. తీసుకున్న ఆహారాన్ని ప్రొటీన్లుగా జీర్ణం చేయడమే దీని పని. అందుకే అజీర్తికి ఇది మంచి మందు.
- కీళ్లనొప్పులు పైనాపిల్ తింటే తగ్గుముఖం పడుతాయి. కారణం.. ఇందులో బ్రొమిలైన్‌కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండు. అయితే దీన్ని ఉదయం భోజనం తర్వాత తింటే మంచిది.
- పైనాపిల్‌లోని ఎంజైమ్ రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ కారణంగా దెబ్బతిన్న కణజాలాన్ని త్వరితగతిన బాగు చేస్తుంది. మధుమేహం కారణంగా ఏర్పడే పుండ్లని, ఇతరత్రా గాయాల్ని కూడా ఇది త్వరగా తగ్గిస్తుంది. ఈ రసం తెగిన గాయాలపై వేస్తే రక్తస్రావం తగ్గుతుంది.
- ఇందులో సమృద్ధిగా పొటాషియం ఉండడం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధుల్లో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇది కడుపులోని పురుగుల్ని చంపేస్తుంది.
- పైనాపిల్‌ను రోజూ రెండు ముక్కల చొప్పున తింటే బెస్ట్. ఇది రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకుంటుంది. అంటే.. రక్తనాళాల్లోంచి గడ్డల్ని తొలిగించి ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది. హీమోఫీలియాతో బాధ పడేవాళ్లు మాత్రం వీటిని తినకపోవడమే మంచిది.
- గొంతునొప్పి, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల్ని పైనాపిల్ తగ్గిస్తుంది. ఈ రసాన్ని గొంతులో పోసుకొని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్ నివారణ అవుతాయి.
- వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలకు పైనాపిల్‌ను మించిన ఔషధం లేదు. ఇందులోని విటమిన్ - సి బ్యాక్టీరియాతో పోరాడి చిగుళ్ల సమస్యను నివారిస్తుంది.
- ఎముకలకు ఇది బలం. పెరిగే పిల్లలకూ, వృద్ధులకూ ఇది చాలా మంచిది. జ్వరం, దగ్గు, జలుబు వచ్చినప్పుడు ఈ పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం మంచిది.
- ఇందులోని పీచుపదార్థం మలబద్దకానికి, ఆడవాళ్లకైతే రుతుక్రమ సమస్యలకు మంచి మందుగా పనిచేస్తుంది.
- పైనాపిల్ డిప్రెషన్, మతిమరుపును తగ్గిస్తుంది. జాండిస్, కాలేయ వ్యాధులున్న వారు ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగితే మంచిది.
అందమే ఆనందం.. పైనాపిల్ ముఖానికి ఐప్లె చేసే ముందు మొదట చేతి మీద లేదా చెవి వెనుక భాగంలో కాస్త రుద్ది టెస్ట్ చేయాలి. చర్మం మంట, దురద, ఎర్రగా మారడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటే ముఖానికి రాసుకోవచ్చు.
-చర్మకాంతిని పొందాలంటే పైనాపిల్ జ్యూస్ సహాయపడుతుంది. ఇందులోని బ్రొమైలిన్ ఎంజైమ్ మొటిమలను నివారించడంతో పాటు చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది. చర్మం ఎలాసిటిని పెంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెంచడం వల్ల ముఖంలో ముడుతలు, మచ్చలు లేకుండా స్కిన్‌టోన్ పెరుగుతుంది.
-ప్రతిరోజూ ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఫెయిర్ అండ్ క్లియర్ స్కిన్ పొందవచ్చు. ఈ జ్యూస్‌ని నీళ్లలో కలిపి ముఖానికి పట్టించి డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల చర్మకాంతి మరింత పెరుగుతుంది.
-పైనాపిల్లోని విటమిన్ సి, అమైనో యాసిడ్స్ చర్మంలో కొలెజెన్‌ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. చర్మాన్ని బిగువుగా, పటుత్వాన్ని కోల్పోకుండా చేస్తాయి. అలాగే చర్మం మీది మృతకణాలను తొలిగించడంలో ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది.
-పైనాపిల్ ైస్లెస్ తీసుకొని చర్మం మీద నేరుగా మర్దన చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీనివల్ల మొటిమలు తగ్గుముఖం పట్టడమే కాదు.. వాటివల్ల మచ్చలు కూడా క్రమంగా చర్మఛాయలో కలిసిపోతాయి.
-పైనాపిల్‌లో, నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి రాయాలి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాకుండా, చర్మం నవయవ్వనంతో నిగనిగలాడేలా చేస్తాయి. చర్మం యంగ్‌గా కనబడడానికి సహాయపడుతుంది.
గులాబీ పైనాపిల్పండ్ల ఉత్పత్తిలో శాస్త్రీయంగా ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంప్రదాయ ఉత్పత్తికి భిన్నంగా ద్రాక్షలో గింజలు లేకుండా.. పండ్ల పరిమాణాన్ని పెంచుతూ వినూత్న రీతిలో ఉత్పత్తి చేస్తున్నారు. పైనాపిల్ పైన ముదురు గోధుమ రంగు పొలుసులతో.. లోపల పసుపు రంగులో ఉంటుందని అందరికీ తెలుసు. అయితే ఈ పండును గులాబీ రండులోకి మార్చడానికి డెల్ మౌంటే అనే ప్రముఖ ఆహార ఉత్పత్తి సంస్థ 2005 నుంచి ప్రయత్నాలు చేస్తున్నది. 2016 డిసెంబర్‌లోనే ఈ పండు ఉత్పత్తికి యూ.ఎస్.ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతినిచ్చింది. టమాట.. పుచ్చకాయ వంటి ఎరుపు, గులాబీ రంగులుండే పండ్లలో లైకోపీన్ అనే వర్ణకారకం ఉంటుంది. అది పైనాపిల్‌లోనూ ఉంటుంది. కానీ కొన్ని ఎంజైమ్స్ గులాబీ వర్ణకారకాన్ని పసుపు రంగులోకి మార్చేస్తాయి. అలాంటి ఎంజైమ్స్‌ను నియంత్రించి ఈ గులాబీ రంగు పైనాపిల్ పండ్లను ఉత్పత్తి చేస్తున్నారు. త్వరలో ఇవి మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి.
-సౌమ్య పలుస

శని దోష నివారణకు నేరేడు పండ్లు | Shani Dosha | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu


శని దోష నివారణకు నేరేడు పండ్లు | Shani Dosha | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Lord Shani Lord Sani Shani Shingnapur Shanideva Lord Surya Son Yamagraj Shanidosham shanidosha nivarana


శని దోష నివారణకు 
నేరేడు పండ్లు

చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలకు శని కారకుడు కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తినటం మంచిది. పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు శని కారకుడు నేరేడు పండ్లు తింటే వెంట్రుకలను కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది. నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి.


ముఖ్యంగా షుగరు రోగులకు నేరేడు చాలా ఉపకరిస్తుంది.దీర్ఘకాల వ్యాదులకు కారకుడైన శని జాతకంలో అనుకూలంగా లేని వారికి రోగ నిరోదక శక్తిని తగ్గించి ప్రతి చిన్న రోగాన్ని దీర్ఘకాలంగా అనుభవించేటట్టు చేస్తాడు.దీని నివారణకు నేరేడు పండ్లను తినటం వలన రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదు.
దేవునికి నేరేడు పండ్లతో నైవేద్యంగా పెడితే బాగా నీరసం, నిస్సత్తువ తగ్గిపోతుంది. నీరసం, నిస్సత్తువ ఉన్న వారు దేవుడిని నేరేడు పండును దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే జబ్బులు దూరమై ఆరోగ్యవంతులుగా తయారవుతారు.
నేరేడు పండును శ్రీ శనైశ్చర స్వామికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి. పూజ చేసిన తర్వాత నేరేడు పండును బ్రాహ్మణునికి దానం చేస్తే రోగ బాధలు కలుగవు.
నేరేడు పండును శనైశ్చర స్వామికి ప్రియమైన నల్ల నవ్వులతో కలిపి దానం చేస్తే శని బాధలు ఉండవు. నేరేడు పండు దేవుని పేరిట పూజించి భిక్షగాళ్లకు దానం చేస్తే దారిద్ర్యం దరిచేరదు.
భోజనంతో పాటు నేరేడు పండును వడ్డిస్తే మీకు ఎప్పుడూ మృష్టాన్న భోజనం లభిస్తుంది. నేరేడు పండును పుణ్యక్షేత్రాల్లో యోగ్య బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేస్తే భూదానం చేసినంత ఫలితం లభిస్తుంది. నేరేడు పండును రోజుకొకటి చొప్పున తింటే వైద్యుల నుంచి దూరంగా ఉండవచ్చునని పండితులు చెబుతున్నారు.
శనైశ్చర స్వామికి నువ్వులనూనెతో గాని,ఆముదం నూనెతో గాని తెలుపు లేదా నలుపు వత్తులను పడమర దిక్కున ఇనుప గరిటెలో శని దీపాన్ని పెట్టి దానికి నేరేడు పండును నైవేద్యం పెట్టాలి. తరువాత ఈ క్రింది శ్లోకం చదవాలి.
శని బాధా వినాశాయ ఘోర సంతాప హారిణే I
కనకాలయ వాసాయ భూతనాధాయతే నమః II
దారిద్ర్యజాతాన్ రోగాదీన్ బుద్ధిమాంద్యాది సంకటాన్ I
క్షిప్రం నాశయ హే దేవ!శని బాధా వినాశక II
భూత బాధా మహాదుఃఖ మధ్యవర్తిన మీశమాం I
పాలయ త్వం మహాబాహో సర్వదుఃఖ వినాశక II
అవాచ్యాని మహాదుఃఖ న్యమేయాని నిరంతరం I
సంభవంతి దురంతాని తాని నాశయమే ప్రభో II
మాయా మోహన్యానంతాని సర్వాణి కరుణాకర I
దూరి కురు సదాభక్త హృదయానందదాయక II
అనేక జన్మ సంభూతాన్ తాప పాపాన్ గుహేశ్వర I
చూర్ణీకురు కృపాసింధో సింధుజాకాంత నందతే II
ఉన్మాదోధ్భూత సంతాపా గాధకూపాద్మహేశ్వర I
హస్తావలంబం దత్వా మాం రక్షరక్ష శనైశ్చర II
దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యౌవనం I
దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే II

ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయాన్నే 19 సార్లు పఠించిన శనిదోషం తొలగిపోవును








హైస్కూల్ విద్యార్థులకు హైటెక్ టెక్ట్స్ బుక్స్ | Highschool Education | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu


హైస్కూల్ విద్యార్థులకు హైటెక్ టెక్ట్స్ బుక్స్ | Highschool Education | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Text Books Highschool Education Telugu Medium Text Books Free Distribution Telugu Text Books Andhra Pradesh Education Education in Andhra Pradesh Technology in Text Books


హైస్కూల్ విద్యార్థులకు
హైటెక్ టెక్ట్స్ బుక్స్

హైస్కూల్ విద్యార్థులకు హైటెక్ టెక్ట్స్ బుక్స్ | Highschool Education | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Text Books Highschool Education Telugu Medium Text Books Free Distribution Telugu Text Books Andhra Pradesh Education Education in Andhra Pradesh Technology in Text Books


బుద్ద నీలకంఠ ఆలయం | Buddha Neelakanta | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu


బుద్ద నీలకంఠ ఆలయం | Buddha Neelakanta | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Lord Buddha Buddha Buddhudu Lord Vishnu

బుద్ద నీలకంఠ ఆలయం
ఇక్కడ విష్ణుమూర్తే నీలకంఠుడు! 

విష్ణుమూర్తిని తలచినంతనే శేషతల్పం మీద శయనించిన అనంత పద్మనాభుడి సమ్మోహన రూపం మన కనులముందు సాక్షాత్కరిస్తుంది. కానీ, స్వామి యోగ నిద్ర భంగిమలో, నింగివైపు చూస్తున్నట్లుగా విగ్రహం ఉండే క్షేత్రం నేపాల్‌లోని ఖాట్మండు లోయలోని బుద్ధనీలకంఠ ఆలయం. అయిదు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం నీటిమీద తేలుతూ ఉండటం ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత. 
బుద్ధనీలకంఠ ఆలయం... ఈ పేరు వినగానే ఇదేదో బుద్ధుడి ఆలయం అనుకోకండి. ఇది మూడుమూర్తులా ఆ నారాయణమూర్తి క్షేత్రమే. బుద్ధనీలకంఠ అంటే పురాతన నీలి రంగు విగ్రహం అని అర్థం. నేపాల్‌ రాజధాని ఖాట్మండు లోయలో ఉందీ క్షేత్రం. స్వామి పేరుమీదుగానే బుద్ధనీలకంఠ అనే ఊరిపేరు కూడా స్థిరపడిపోయింది. ఈ ఆలయాన్ని నారాయణంతన్‌ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఆది శేషువు మీద యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. సాధారణంగా వైష్ణవాలయాల్లో విష్ణుమూర్తి రూపాలు శయన మూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకుని ఉన్నట్లు ఉంటాయి. కానీ, ఇక్కడ మాత్రం వెల్లకిలా పడుకొని నింగివైపు చూస్తున్నట్టుగా ఉండే బుద్ధనీలకంఠుడి విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత ఏమిటంటే, సుమారు అయిదు అడుగుల పొడవున్న ఈ భారీ రాతి విగ్రహం నీటిమీద తేలుతూ ఉండటమే. ఈ కారణంగానే భక్తులనే కాకుండా పర్యటకులనూ ఎక్కువగా ఆకర్షిస్తోందీ బుద్ధనీలకంఠ క్షేత్రం. 
స్థలపురాణం 
ఈ భారీ రాతి విగ్రహం వందల సంవత్సరాల నుంచీ నీటిలో తేలుతూ ఉందని ఈ ఆలయం మీద జరిగిన అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిదాని ప్రకారం... ఒక రైతు తన భార్యతో కలిసి పొలం దున్నుతుండగా, ఒక చోటుకు రాగానే నాగలి ఆగిపోయింది. అక్కడ భూమిలో నాగలి దిగిన ప్రదేశం నుంచి రక్తం బయటకు రావడం కనిపించింది. రక్తం వస్తున్న ప్రాంతంలో భూమిని తవ్వగా, భారీ విగ్రహం బయట పడింది. ఆ తర్వాత గ్రామస్థుల సహాయంతో ఈ విగ్రహాన్ని ఇప్పుడున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. మరో కథనం ప్రకారం... ఏడో శతాబ్దంలో నేపాల్‌ ప్రాంతాన్ని గుప్త రాజు విష్ణుగుప్తుడు పాలించేవాడు. ఇతడికి సామంత రాజూ, ఖాట్మండు లోయను పాలిస్తున్న లిచ్చవి వంశీయుడైన భీమార్జున దేవుడు ఈ విగ్రహాన్ని తయారు చేయించి, ఇక్కడ ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతారు. 
హరిబోధిని... 

విష్ణుమూర్తి ఆలయాల్లో లేదా వైష్ణవ సంప్రదాయంలో ఏకాదశి రోజును పవిత్రమైనదిగా భావిస్తారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కార్తిక మాసాన్ని చెబుతారు పండితులు. ఈ రెండింటినీ కలగలుపుతూ బుద్ధనీలకంఠ ఆలయంలో కార్తిక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఎందుకంటే శివుడు హాలాహలాన్ని కంఠంలో దాచుకున్నప్పుడు ఆ వేడి తాళలేక ఈ ప్రాంతానికి వచ్చాడనీ ఇక్కడి కొలనులో నీళ్లు సేవించగానే మంట తగ్గి, కొంతసేపు సేదతీరాడనీ భక్తుల విశ్వాసం. దానికి గుర్తుగానే ఈ ఆలయంలో కార్తిక మాసం మొత్తం ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ నెలరోజులూ ఈ ప్రాంతం పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. కార్తిక శుద్ధ ఏకాదశి రోజున హరిబోధిని మేళాను నిర్వహిస్తారు. ఈ పండగ ముఖ్య ఉద్దేశం నిద్రపోతున్న మహావిష్ణువును మేల్కొల్పడం. ఈ మేళాలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. మేళతాళాలతో భజనలతో ఆ రోజు ఈ ప్రాంతమంతా విష్ణునామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. బుద్ధనీలకంఠ ఆలయంతోపాటు పశుపతినాథ్‌ ఆలయం, స్వయంభూనాథ్‌ స్తూపం, మహాదేవ్‌ టెంపుల్‌, జానకీ మందిర్‌, వాల్మీకి ఆశ్రమాలు కూడా నేపాల్‌లో ప్రసిద్ధ హిందూ క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. 
ఇలా వెళ్లాలి... 
బుద్ధనీలకంఠ ఆలయాన్ని చేరుకోవడానికి రోడ్డు, రైలు మార్గాలతోపాటు విమాన సదుపాయాలూ ఉన్నాయి. భారతదేశం నుంచి నేపాల్‌ చేరుకోవడానికి వివిధ రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి నేపాల్‌ పర్యటక శాఖ ఆలయానికి ప్రత్యేక బస్సులు
నడుపుతోంది. రైలుమార్గం ద్వారా... ఖాట్మండు స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

బుద్ద నీలకంఠ ఆలయం | Buddha Neelakanta | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Lord Buddha Buddha Buddhudu Lord Vishnu










mohan publications price list