MohanPublications Print Books Online store clik Here Devullu.com

పంచ శౌచాలు | PanchaSowchalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktibooks


పంచ శౌచాలు | PanchaSowchalu | makarandam antaryami eenadu GRANTHANIDHI | MOHANPUBLICATIONS |  MAKARANDAM ANTARYAMI bhaktibooks

తనువు శుభ్రం మనసు భద్రం


శుచి, శుభ్రత భౌతిక ప్రయోజనాల కోసమేనా?అది కేవలం శారీరక సంబంధమైన విషయమా? నిజానికి శుభ్రత ఒక ధర్మం. అది ఆడంబరం కాదు. ఆచారం అంతకన్నా కాదు. అదో అనంతమైన విజ్ఞానం. మనిషి నడతను తీర్చిదిద్దే సంస్కారం.శుభ్రత బాహ్యం, ఆంతరంగికం అని రెండు రకాలుగా ఉంటుంది. నిత్యం చేసే స్నానం బాహ్యశౌచాన్ని కలిగిస్తుంది. మనసులో ఉండే అజ్ఞానాన్ని సాధన ద్వారా దూరం చేసుకోవడం ఆంతరంగిక శౌచం అవుతుంది. బాహ్యశౌచం కన్నా మానసిక శౌచం చాలా అవసరం. మనస్సు స్వచ్ఛంగా (శుచిగా) లేకపోతే, బాహ్యశౌచం ఏవిధమైన ఫలితాన్ని ఇవ్వదు.


- జగద్గురు ఆది శంకరాచార్య

పంచ శౌచాలు 

శాస్త్రగ్రంథాలు శౌచం (శుభ్రత) ఐదు రకాలుగా ఉంటుందని చెబుతున్నాయి. 
మనశ్శౌచం 
మనసులో రాగద్వేషాలకు తావు లేకుండా ఉండడం 
కర్మశౌచం 
కపటం లేకుండా, ధర్మాన్ని పాటిస్తూ నిత్యవిధులను నిష్కామంగా చేస్తూ జీవించడం 

కులశౌచం 

నీచమైన పనులకు దిగజారకుండా, సదాచారాన్ని పాటిస్తూ స్థిరంగా ఉండడం 

శరీరశౌచం 

స్నానం తదితర క్రియల ద్వారా శరీరాన్ని శుభ్రంగా ఉంచడం 

వాక్‌శౌచం 

అనుక్షణం సత్యాన్ని మాత్రమే పలకడం 


పరిశుభ్రమైన మనస్సు, శరీరం అద్భుతాలను చేస్తాయి. ఆ విషయాన్ని గుర్తించిన సనాతన భారతీయ సంప్రదాయం శౌచం లేదా శుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. అసూయ, ఆందోళన, అనుమానం, అసహనం, ఈర్ష్య, ద్వేషం, కోపం మొదలైన అవగుణాలు లేని మనస్సు ఎంతో స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. దీన్నే మానసిక శౌచం అంటారు. స్వచ్ఛమైన మనస్సుతో చేసే పూజ, ధ్యానం, తపం ఎంత చిన్నవైనా అనంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే మహాయోగి వేమన ‘చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?’ అంటారు. అలాగే మలినాలేవీ శరీరానికి అంటకుండా ఉండేలా స్నానాది విధులు చెయ్యటాన్ని బాహ్య శౌచం అంటారు. ఈ భౌతికమైన శుభ్రత మానసిక ఉన్నతికి పునాదిగా నిలుస్తుంది. శారీరకంగా, ఆంతరంగికంగా.. పరిశుభ్రత మనిషికి ఏకాగ్రతనిస్తుంది..లక్ష్యసాధన వైపు నడిపిస్తుంది 


అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా 
యస్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతశ్శుచిః 


నిత్యవిధుల్లో పూజా కార్యక్రమాలన్నీ ఈ శ్లోక పఠనంతోనే ప్రారంభమవుతాయి. భగవంతుడి అనుగ్రహం పొందాలంటే బాహ్య, అంతరంగ శౌచాలు తప్పనిసరి... పుండరీకాక్షుడి స్మరణం వల్ల శుచిత్వం వస్తుందని చెబుతుందీ శ్లోకం. 


బలం, ఆయుష్షు, ఆరోగ్యం, సంతోషం, ఆరోగ్యవంతమైన మనస్సు... ఇవన్నీ శుభ్రత వల్లనే లభిస్తాయని శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. శుభ్రత లేని చోట పరమాత్మ ఉండడు. స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రార్థన లేదా ధ్యానం ప్రారంభించాలి. ఇది ఆధ్యాత్మిక సాధనలో తొలిమెట్టు. శాస్త్ర గ్రంథాలు కూడా ‘శుచిత్వం మాతృరూపేణ’ అంటాయి. శుచిత్వం మనకు తల్లివంటిది. తల్లి ఏవిధంగా బిడ్డకు సదా రక్షగా ఉంటుందో, శౌచం కూడా అలాగే, మనల్ని రక్షిస్తుందని భావం. 


వేదాలు, ఉపనిషత్తులు కూడా ఈ అంశానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చాయి. రుగ్వేదంలో అనేక చోట్ల శుభ్రతను గురించి ప్రస్తావన వస్తుంది. స్కందోపనిషత్తు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడమే శుచిత్వమని చెబుతుంది. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం కలిగిఉంటామో, అప్పుడు మనస్సు ధర్మమార్గాన్ని విడిచిపెట్టదు. భగవద్గీతలో చెప్పిన ఆంతరంగిక శౌచం ఇదే. 


శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో అనేక చోట్ల శుచిగా ఉండాల్సిన అవసరం గురించి చెబుతాడు. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగంలో ‘శుచిత్వమే జ్ఞానం’ అని వివరిస్తాడు.. శుభ్రత అది దేవతల లక్షణాల్లో ఒకటని అంటాడు. ఇదే విషయాన్ని రూఢి పరుస్తూ దైవాసుర సంపద్విభాగయోగంలో శుచిగా ఉండని వారికి రాక్షస ప్రవృత్తి ఉంటుందని చెబుతారు. శారీరకంగా శుభ్రంగా ఉండకపోవడం వల్ల మంచి ఆలోచనలు చేయలేరు. మంచి ఆలోచనలు చేసే మనసు ధర్మాన్ని విడిచిపెట్టదు. అంతిమంగా మనిషి భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతాడు. నిజానికి శుభ్రత శారీరక తపస్సులో ఒక భాగం.స్వామి వివేకానంద ‘ఎ సౌండ్‌ మైండ్‌ ఇన్‌ ఎ సౌండ్‌ బాడీ’ - ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుందని చెప్పారు. శ్రీనాథమహాకవి కూడా తన చాటువుల్లో ఓ చోట ‘అంగడి యూర లేదు వరి యన్నము లేదు శుచిత్వ మేమి లేదు....’ అంటూ వాపోతాడు. ఇక మరెప్పుడూ అలాంటి ప్రదేశాలకు రానంటాడు. శుభ్రత లేనిచోట పెద్దలు, పండితులు ఉండరు అనటానికి శ్రీనాథుడి వృత్తాంతమే ఉదాహరణ.ఆంగ్లంలో ‘క్లీన్లీనెస్‌ ఈజ్‌ నెక్ట్స్‌టు గాడ్‌’ - దైవం తర్వాత రెండో స్థానం పరిశుభ్రతదే అనే సామెత ఉంది. హైందవ సంప్రదాయాలతో పాటు పాశ్చాత్య సంప్రదాయంలోనూ శుభ్రతకు దైవంతో సమానమైన ప్రాధాన్యత ఉందనే విషయం ఈ సామెత ద్వారా తెలుస్తుంది. 

శుచిత్వం మనకు జీవనవిధానం కావాలి. పరమాత్మ దర్శనానికి సోపానం కావాలి. 

‘శ్రీసూక్తం’లో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి. వీటిలోని 16వ మంత్రం... యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశశ్చంచ శ్రీకామస్సతతం జపేత్‌లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి 15 మంత్రాలను నిత్యం పారాయణం చెయ్యాలని భావం. ఎక్కడ శుచిత్వం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం కూడా ధనమే. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు. శుభ్రత, శాంతి ఉన్న చోట అనారోగ్యం దరిచేరదు. అంతకుమించిన భాగ్యం మరొకటి ఉంటుందా?

శుభ్రత ప్రాధాన్యాన్ని వివరించే పలు పురాణ కథలూ ఉన్నాయి. కశ్యప ప్రజాపతికి దితి, అదితి ఇద్దరు భార్యలు. దితి కుమారులు దైత్యులు - అంటే రాక్షసులు. అదితి కుమారులు ఆదిత్యులు - అంటే దేవతలు. వారిద్దరి వైరం గురించి తెలిసిందే. దేవతల చేతిలో రాక్షసులు చనిపోవడాన్ని చూసి తట్టుకోలేని దితి, ఇంద్రుడి సంహరించే శక్తి కలిగిన కుమారుడు తనకు జన్మించాలని భర్త అయిన కశ్యపుడిని కోరుతుంది. ఆయన ‘సరే’ అని వరమిస్తాడు. కానీ, ప్రసవం అయ్యేవరకు శుభ్రతను అన్నివేళలా పాటించితీరాలని, లేకపోతే గర్భం భిన్నమవుతుందని నియమం పెడతాడు. దితి అంగీకరిస్తుంది. శుభముహూర్తంలో దితి గర్భం దాలుస్తుంది. విషయం తెలుసుకున్న ఇంద్రుడు పినతల్లి అయిన దితి దగ్గరకు వచ్చి మంచి మాటలు చెప్పి, ఆమెకు సేవ చేసే అవకాశం ఇవ్వమని అడుగుతాడు. ఆమె అంగీకరిస్తుంది. ఒకరోజు సాయం సంధ్యా సమయంలో పొరపాటున దితి కాళ్లు చేతులు కడుక్కోకుండానే పడకగదిలోకి వెళ్లి నిద్రలోకి జారుకుంటుంది. దితికి నియమభంగం కాగానే, ఇంద్రుడు అణురూపంలో ఆమె గర్భంలోకి ప్రవేశించి, శిశువును నరకడం ప్రారంభిస్తాడు. వెంటనే దితికి మెలకువ వస్తుంది. తన బిడ్డను వధించవద్దని, తన బిడ్డ దేవతలకు అనుకూలంగా ఉంటాడని ఇంద్రుడిని వేడుకుంటుంది. అతడు అంగీకరించి, బయటకు వచ్చి, తన వల్ల ముక్కలైన శిశువు మరణించకుండా, ఎన్ని ముక్కలైందో అందరు పుత్రులు పుడతారని చెబుతాడు. అలా ఏర్పడ్డ శిశువులే దేవతాగణాల్లో ఒకటైన ‘మరుద్గణం’. ఈ వృత్తాంతం జరిగనప్పటి నుంచి ‘సంధ్యాసమయంలో తప్పనిసరిగా శుచిగా ఉండాలని, నిద్రించకూడదనే’ ఆచారం వాడుకలోకి వచ్చింది. 


బుద్ధభగవానుడు ‘బాహ్య పరిశుభ్రతతో పాటు మనసులోని క్లేశాలు తొలగించుకుని, మనోశుభ్రతను కూడా పాటించాలని’ బోధించేవాడు. ఇందుకోసం ‘విమల కీర్తి నిర్దేశక సూత్రాల’ను ప్రతిపాదించాడు. మనసుకు అంటిన మాలిన్యాలు (రాగద్వేషాలు మొదలైనవి) పోగొట్టుకోవటానికి ప్రతి ఒక్కరూ ‘షట్‌ పారమితులు’, ‘పంచశీల’ పాటించాలని బౌద్ధధర్మం చెబుతోంది. ఈ ప్రక్రియలో ఉపాసకుడు ఆచరించాల్సిన ‘ద్వాదశ నీవరణాలను’ కూడా బౌద్ధం వివరిస్తుంది. ప్రత్యేకించి ‘శౌచవ్రతాని’కి బౌద్ధం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుంది.


‘హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు’ (మత్తయి 5:8) అంటూ ప్రభువు నిష్కల్మషమైన మనస్సుకు ప్రాధాన్యతనిచ్చారు.. మనిషి మనసులో కలిగే ఆలోచనే అతని నడవడికను నిర్దేశిస్తుంది. మనోశుద్ధితో కూడిన బాహ్యశుద్ధి మాత్రమే దేవుడి వద్దకు దారి చూపిస్తుందని క్రైస్తవ ధర్మం కూడా శుచిత్వానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. 

- డా. కప్పగంతు రామకృష్ణ
పంచ శౌచాలు | PanchaSowchalu | makarandam antaryami eenadu GRANTHANIDHI | MOHANPUBLICATIONS |  MAKARANDAM ANTARYAMI bhaktibooks


ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం | World_No_Tobacco_Day | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం | World_No_Tobacco_Day | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu World No Tobaccoday Tobbaccoday Cigarette smoking tobacco lungs cigarette smoking Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI



పొగ చిచ్చు!
మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం

గుప్పు గుప్పుమని పొగ వదులుతూ.. ఆనందాన్ని పొందుతున్నామని చాలామంది భావిస్తుంటారు గానీ ఇది కళ్ల నుంచి కాళ్ల వరకూ ‘పొగ’ పెడుతుంది. సిగరెట్లు, చుట్టలు, బీడీలు.. ఇలా ఏ రూపంలో అయినా పొగ తీవ్ర అనర్థాలను తెచ్చిపెడుతుంది. క్రమంగా ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలను దెబ్బతీస్తూ.. గుండెజబ్బులు, పక్షవాతం వంటి ముప్పులను పెంచుతుంది. అంతేకాదు.. రకరకాల క్యాన్సర్లనూ వెంటబెట్టుకు వస్తుంది. పొగకు తోడు గుట్కాలు, జర్దాలు, ఖైనీల వంటివీ పెద్ద సమస్యగా మారిపోయాయి. కాబట్టి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం నేపథ్యంలో దీని అనర్థాల గురించి తెలుసుకొని ఉండటం ఎంతో అవసరం.

సిగరెట్‌ కాల్చటం వల్ల కాసేపు ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తొండొచ్చు. కొద్దిసేపు తృప్తి, ఆనందం వంటివి కలగొచ్చు. కానీ దీనిలోని పొగాకులోని నికొటిన్‌ క్రమక్రమంగా మనిషిని లోబరచుకుంటుంది. పొగ రూపంలో అయినా.. జర్దా, ఖైనీ, గుట్కాల వంటి రూపాల్లో అయినా నికొటిన్‌ తీవ్ర అనర్థాలు తెచ్చిపెడుతుంది. పొగాకులో ఒక్క నికొటిన్‌ మాత్రమే కాదు.. సుమారు 7వేల రకాల విషతుల్యాలుంటాయి. పొగ పీల్చిన వెంటనే ఇవన్నీ మూకుమ్మడిగా రక్తంలో కలిసి ఒళ్లంతా విస్తరిస్తాయి. ఈ విషతుల్యాల్లో సుమారు 400 రకాల రసాయనాలు క్యాన్సర్లకు కారణమవుతున్నాయని అధ్యయనాలు గుర్తించాయి. ముఖ్యంగా ఆర్సెనిక్‌, బెంజీన్‌, బెరీలియం, కాడ్మియం, క్రోమియం, ఇథిలీన్‌ ఆక్సైడ్‌ వంటి రసాయనాలు కచ్చితంగా క్యాన్సర్లను తెచ్చిపెడుతున్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. సిగరెట్లు, చుట్టల పొగలోని ఈ రసాయనాలు నోటి నుంచే శరీరంలోకి వెళ్లటం ప్రారంభిస్తాయి. ముందుగా ఇవి నోట్లోని సున్నితమైన జిగురు పొరల ద్వారా కొంత లోపలికి వెళ్లిపోతాయి. పొగ ఊపిరితిత్తుల్లోకి చేరుకున్నప్పుడు అక్కడ్నుంచి ఇవి రక్తంలో కలుస్తాయి. అనంతరం శరీర స్రావాలన్నింటిలోకి చేరి, స్థిరపడిపోతాయి. అందువల్ల ఇవి ఒక్క ఊపిరితిత్తుల్లోనే కాదు. శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్లను తెచ్చిపెట్టే ప్రమాదం పొంచి ఉంటుంది.
అన్నీ ముప్పులే..పొగాకు శరీరంలోని అన్ని అవయాల మీదా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులను దెబ్బతీసి సీవోపీడీ (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌) న్యుమోనియా, ఆస్థమా వంటి జబ్బులకు దారితీస్తుంది. పొగాకు మూలంగా రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరుగుతాయి. దీంతో రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండె జబ్బులు, గుండె వైఫల్యం వంటి ముప్పులు పెరుగుతాయి. అధిక రక్తపోటు, పక్షవాతం వంటివి సరేసరి. రక్తనాళాలు సంకోచించటం వల్ల దీర్ఘకాలంగా పుండ్లు మానకుండా ఉండిపోవచ్చు. కొన్నిసార్లు గ్యాంగ్రీన్‌కూ దారితీయొచ్చు. పొగాకు నేరుగా కిడ్నీల పైనా ప్రభావం చూపుతుంది. మగవారిలో స్తంభన లోపం మరో సమస్య. స్తంభనలోపంతో బాధపడుతున్నవారిలో సుమారు 85% మంది పొగరాయుళ్లే కావటం గమనార్హం. ఆడవారిలోనైతే పొగ తాగే అలవాటు మూలంగా గర్భం నిలవకపోవటం, నెలలు నిండకముందే కాన్పు కావటం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టటం వంటి దుష్ప్రభావాలు కనబడతాయి.
* పొగ అలవాటు జీవన కాలాన్నీ తగ్గిస్తుంది. పొగ తాగటం వల్ల 12.2 నుంచి 14.5 ఏళ్ల ఆయుర్దాయం తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాల్చే ప్రతి సిగరెట్టుతో 11 నిమిషాలు ఆయుష్షు తగ్గుతోంది!
కణకణాన్ని దెబ్బతీస్తుందిమన శరీరంలోని కణాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో విభజన చెందుతుంటాయి. ఒక క్రమ పద్ధతిలో వృద్ధి చెందుతుంటాయి. ఈ ప్రక్రియలను జన్యువులు నియంత్రిస్తుంటాయి. దీని మూలంగానే మన శరీర ఎదుగుదల క్రమ పద్ధతిలో సాగుతూ వస్తుంటుంది. పొగలోని విషతుల్యాలు సరిగ్గా ఈ ప్రక్రియనే దెబ్బతీయటం ఆరంభిస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ల మోతాదులు తగ్గేలా చేస్తాయి. కణితులు ఏర్పడటాన్ని అడ్డుకునే జన్యువుల పనితీరును మార్చేస్తాయి. దీంతో కణాల విభజన, పెరుగుదల మీద నియంత్రణ, పట్టు తప్పిపోతాయి. ఇవి ఇష్టం వచ్చినట్టుగా, అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయి.. క్యాన్సర్‌ కణితులుగా మారిపోయి.. ప్రాణాంతకంగా పరిణమిస్తాయి.
* పొగ ఎన్నేళ్లు తాగితే అంత ముప్పు ఎక్కువవుతుంది. దీన్నే ప్యాక్‌ ఇయర్స్‌ పేరుతో లెక్కిస్తారు. అలాగే పొగ తాగే తీరు కూడా క్యాన్సర్‌ ముప్పు ఆధారపడొచ్చు. పొగను గట్టిగా లోపలికి పీల్చుకోవటం, బలంగా దమ్ము లాగుతూ.. పొగను పూర్తిగా పీల్చుకోవటం వల్ల కూడా క్యాన్సర్‌ ముప్పు పెరిగే అవకాశముంది. పొగ అలవాటు మానేసిన తర్వాత.. దాదాపు పదేళ్ల వరకూ క్యాన్సర్‌ ముప్పు పొంచే ఉంటుంది. కాబట్టి అసలు పొగ తాగే అలవాటు చేసుకోకపోవటమే అన్నింటికన్నా ఉత్తమం. అప్పటికే అలవాటుంటే తక్షణమే మానెయ్యటం మంచిది.
పొగ తాగటమే కాదు, ఇతరులు వదిలిన పొగను పీల్చినా ప్రమాదమే. ఇది కూడా క్యాన్సర్లను తెచ్చిపెడుతున్నట్టు అధ్యయనాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఇది రెండు రకాలుగా జరగొచ్చు. ఒకటి- ఇతరులు సిగరెట్ల వంటివి కాలుస్తున్నప్పుడు వాటి నుంచి వెలువడే పొగను నేరుగా పీల్చటం. రెండోది- పొగరాయుళ్లు వదిలిపెట్టిన పొగను పీల్చటం. ఇది పక్కవారికీ ప్రమాదకరంగా పరిణమిస్తుండటం గమనార్హం. దీని మూలంగా ఇంట్లోని స్త్రీలు, పిల్లలు కూడా క్యాన్సర్ల బారినపడే ప్రమాదముందని గుర్తించటం అవసరం.


దిగ్భ్రాంతికర వాస్తవాలు

పొగాకు వాడకంపై మనదేశంలో ఇటీవల చేపట్టిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 27 కోట్ల మంది పొగాకు వాడుతుండగా.. వీరిలో 6.84 కోట్ల మంది పొగ తాగేవారు కాగా 16.3 కోట్ల మంది ఇతరత్రా రూపాల్లో పొగాకును వినియోగిస్తున్నారు. ఇక 4.23 కోట్ల మంది ఇటు పొగ రూపంలోనూ అటు ఇతరత్రా రూపాల్లోనూ పొగాకును వాడుతున్నారు. పురుషుల్లో 48% మంది, మహిళల్లో 20% మంది పొగాకును వాడుతున్నారు.
* మహిళల్లో పొగ తాగే అలవాటు మనదగ్గరా ఎక్కువగానే కనబడుతోంది. సుమారు 1.21 కోట్ల మంది మహిళలు పొగ తాగుతున్నట్టు అంచనా. ఈ విషయంలో అమెరికా తర్వాత స్థానం మనదే కావటం గమనార్హం. పొగ తాగటాన్ని అరికట్టటానికి చేపట్టిన ప్రచారాల మూలంగా పురుషుల్లో ఈ అలవాటు కాస్త తగ్గుముఖం పడుతున్నా మహిళల్లో మాత్రం అలాగే ఉంటోంది. పట్ణణాల్లో ఈ ధోరణి హోదాకు చిహ్నంగా భావిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు ఆకలి, నొప్పి తగ్గించుకోవటానికి మహిళలు పొగ తాగుతున్నారు.
* పొగాకు వాడకంతో తలెత్తుతున్న జబ్బులు ఆర్థిక వ్యవస్థకూ భారంగా పరిణమిస్తున్నాయి. 35-69 ఏళ్ల వారిలో కనబడుతున్న పొగాకు సంబంధ జబ్బులతో 1.05 లక్షల కోట్లు ఖర్చుపెట్టాల్సి వస్తున్నట్టు (జీడీపీలో 1.1%) అంచనా.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం | World_No_Tobacco_Day | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu World No Tobaccoday Tobbaccoday Cigarette smoking tobacco lungs cigarette smoking Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI



రాష్ట్ర చిహ్నాలు | State icons | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktibooks

రాష్ట్ర చిహ్నాలు | State icons | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktibooks

రాష్ట్ర చిహ్నాలు | State icons | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktibooks

రాష్ట్ర చిహ్నాలు | State icons | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktibooks

     ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వృక్షంగా వేప చెట్టును ప్రభుత్వం గుర్తించింది. దీనితో పాటు మరికొన్ని ముఖ్యమైన రాష్ట్ర చిహ్నాలను బుధవారం ఖరారు చేసింది. ఈ మేరకు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వం ఈ చిహ్నాలను ఖరారు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.



సంతాన దేవత... ద్రౌపది | Draupadi | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu


సంతాన దేవత... ద్రౌపది | Draupadi | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu Draupadi Draupathi lord Draupathi putturu chaituru narayana vanam nagulapuram vedanarayana swamy Tirumala Tirupati Tirumala Tirupati TTD Tirumala Tirupati Devastanams Sapthagiri Lord Venkateswara Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


సంతాన దేవత... ద్రౌపదమ్మ! 
చిత్తూరు జిల్లాలోని దాదాపు ప్రతి గ్రామంలో పాండవుల గుడి, ధర్మరాజు ఆలయం, ద్రౌపదమ్మ కోవెల... ఇలా అనేక పేర్లతో పాండవులకు ఆలయాలు ఉన్నాయి. వీటిలో పుత్తూరులో కొలువైన ద్రౌపదీ సమేత ధర్మరాజు ఆలయం విశిష్టమైంది. పురాణాల ప్రకారం సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి ఛాయా రూపమైన ద్రౌపది ఈ క్షేత్రంలో భక్తులపాలిట కొంగుబంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది.

    అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా। పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్‌।। అంటే, అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ ఈ అయిదుగురు పుణ్యమూర్తులనూ ప్రతిరోజూ స్మరించినంతనే పాపాలు నాశనమవుతాయని భావం. అంతేకాదు ఇక్కడ వెలసిన ద్రౌపదిని అర్చిస్తే సంతానం లేనివారికి తప్పక సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. తెల్లదొరలు సైతం పూజించిన తల్లిగా పుత్తూరులోని 

ద్రౌపదీదేవి ఆలయం ప్రసిద్ధి చెందింది.స్థలపురాణం 

సంతాన దేవత... ద్రౌపదమ్మ!

నాలుగు వందల సంవత్సరాల కిందట పుత్తూరు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు కరవుకాటకాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే పుత్తూరు సమీపంలోని చైటూరు గ్రామంలో ఆరుగురు అన్నదమ్ములు కలిసి బావి తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వుతూ ఉండగా ద్రౌపది దేవి చెక్క విగ్రహం బయటపడింది. అదే రోజు రాత్రి వారిలో చిన్నవాడైన చినతంబికి ద్రౌపదీమాత కలలో కనిపించి తనకు దేవాలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించింది. మర్నాడు నిద్ర లేచిన చినతంబి తన స్వప్న వృత్తాంతాన్ని అన్నలకు చెప్పగా, వాళ్లు ‘మన దగ్గర ఆలయాన్ని నిర్మించేంత ధనం లేదు కాబట్టి, ఆ అమ్మవారి విగ్రహాన్ని పట్టుకుని ఊరూరా తిరుగుతూ విరాళాలు సేకరించు’ అని చెబుతారు. అన్నల మాట ప్రకారం చినతంబి ద్రౌపది దేవి విగ్రహాన్ని నెత్తిమీద పెట్టుకుని, కొరడాతో కొట్టుకుంటూ, కత్తి సాము చేసుకుంటూ ఊరూరా తిరుగుతాడు. కార్వేటి నగర మహారాజు సాల్వవెంకట పెరుమాళ్ల దగ్గరకు వెళ్లి తన విద్యను ప్రదర్శించి, విరాళం అడుగుతాడు చినతంబి. కత్తితో కోసుకున్నా గాయాలు కాకపోడం చూసిన మహారాజు ఆశ్చర్యానికి గురవుతాడు. అతడి దగ్గరున్న పదునైన కత్తిని ఇచ్చి, మళ్లీ కోసుకోమని చెబుతాడు. చినతంబి మహారాజు ఇచ్చిన కత్తితో కోసుకున్నా ఒంటి మీద ఒక్కగాయం కూడా కాదు. అది చూసి ముచ్చటపడిన రాజు ‘నీకు ఏం కావాలో కోరుకో’మని అడుగుతాడు. ద్రౌపదీదేవికి ఆలయాన్ని నిర్మించమని కోరతాడు చినతంబి. అందుకు అంగీకరించిన రాజు పుత్తూరులో ఆలయాన్ని నిర్మిస్తాడు. పుత్తూరు అంటే తమిళంలో కొత్త ఊరు అని అర్థం. ఈ ప్రాంతంలో పుట్టలు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని పుట్టల ఊరు అని పిలిచేవారు. కాలక్రమంలో అది పుత్తూరుగా మారిపోయింది.
ఏటా ఉత్సవాలు 
ఈ ప్రాంతం బ్రిటిష్‌ పాలన కింద ఉన్నరోజుల్లో ఒక తెల్లదొర పుత్తూరులో పర్యటించాడు. ద్రౌపది దేవి ఆలయాన్ని చూసి హేళనగా మాట్లాడాడు. ఫలితంగా ఆ అధికారికి చూపు పోయింది. దీంతో తన తప్పు తెలుసుకున్న అధికారి అమ్మవారిని క్షమించమని ప్రార్థించగా తిరిగి చూపు వచ్చింది. ఆ సందర్భంగా బ్రిటిష్‌ అధికారి అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలను జరిపించాడు. అప్పటి నుంచి ఏటా శ్రావణ మాసంలో ధర్మరాజు సమేత ద్రౌపదీదేవికి 18 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. వీటిల్లో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ ఉత్సవాల్లో కుతమత భేదం లేకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. ప్రతి నెలా అమావాస్య రోజున అమ్మవారికి ఊంజల్‌ సేవ నిర్వహిస్తారు. సంతానంలేనివారు ఇందులో పాల్గొంటే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయంలోని ద్రౌపదమ్మను సంతాన లక్ష్మిగానూ అర్చిస్తారు. 
చూడదగ్గ ప్రదేశాలు 
పుత్తూరుకు చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వరస్వామి, నాగలాపురం వేదనారాయణస్వామి, సురుటుపల్లి పల్లికొండేశ్వరస్వామి, అప్పలాయిగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి, కార్వేటి వేణుగోపాలస్వామి దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. వీటితోపాటు రాజులనాటి కోట, కొలనును చూడొచ్చు. కైలాసనాథకోన, మూలకోన, శింగిరికోన మొదలైన ప్రాంతాలు పర్యటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. 
ఇలా చేరుకోవచ్చు 
పుత్తూరు ద్రౌపదీదేవి సమేత ధర్మరాజు ఆలయం తిరుపతి నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి పుత్తూరు మీదుగా వెళ్లే తిరుత్తణి, అరక్కోణం, కంచి, సత్యవేడు, చెన్నై బస్సుల్లో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు. తిరుపతి, రేణిగుంట రైల్వేస్టేషన్ల నుంచి పుత్తూరుకు రైలు సౌకర్యం ఉంది. సప్తగిరి, గరుడాద్రి, చెన్నై - ముంబయి ఎక్స్‌ప్రెస్‌లతోపాటు పలు లోకల్‌ రైళ్లూ అందుబాటులో ఉన్నాయి.
- ఈ.శివరామ ప్రసాద్‌

తిరుమల ఓ పూల మండపం | Tirumala Temple | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu


తిరుమల ఓ పూల మండపం | Tirumala Temple | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Tirumala Tirupati Tirumala Tirupati TTD Tirumala Tirupati Devastanams Sapthagiri Lord Venkateswara Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


తిరుమల ఓ పూల మండపం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు... శ్రీ వేంకటేశ్వరుడు.. ఆయన పుష్పాలంకార ప్రియుడు. ఆయనకు తిరుమల పర్వత సానువుల్లో దొరికే రంగురంగుల పుష్పాలు, పరిమళపత్రాలతో నిత్యం పూజ చేసే సంప్రదాయం ఉంది. అందుకే ఈ క్షేత్రాన్ని ‘పుష్పమండపం’ అని భగవద్‌ రామానుజలు అభివర్ణించారు. ఇక్కడ పుష్ప కైంకర్యం అత్యంత పవిత్రమైన కార్యం అని నమ్మాళ్వారు తన ‘తిరువాయ్‌ మొళి’ గ్రంథంలో పేర్కొన్నారు. శ్రీరామానుజుల ప్రేరణతో ఆయన శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వచ్చి రోజూ పుష్పార్చన చేస్తుండేవారు. అంతకు ముందే రామానుజుల గురువైన యమునాచార్యులు ఈ క్షేత్రంలో ఉంటూ స్వామివారిని పుష్పాలతో పూజించేవారు. అందుకే అనంతాళ్వారులు తాను చేస్తున్న కైంకర్యాన్ని ‘యామునాత్తురై’ అనే పేరుతో కొనసాగించినట్లు ‘శ్రీ వేంకటాచల ఇతిహాస మాల’ అనే గ్రంథంలో స్పష్టంచేశారు. ఇప్పటికీ శ్రీనివాసునికి అదే పేరుతో పుష్పార్చన జరుగుతోంది. ప్రస్తుతం స్వామి వారికి రోజూ ‘తోమాల సేవ’లో పుష్పాలంకరణ జరుగుతుంది. రుతువుల ప్రకారం ఆయా కాలాల్లో పూచే తాజా పూలను సేవలో వాడతారు.
శ్రీవారి సన్నిధిలో నిత్యకళ్యాణం పచ్చతోరణమే. అయితే వసంత, గ్రీష్మ రుతువులకు ఓ ప్రాధాన్యం ఉంది. ఈ కాలంలో పూలు ఎక్కువగా పూస్తాయి. ప్రకృతి సుగంధభరితంగా ఉంటుంది. స్వామివారి ఉద్యానవనాలు పరిమళించే కాలం కావడంతో స్వామికి పుష్పార్చన విశేషంగా జరుగుతుంది. జీవ వైవిధ్యాన్ని తెలుసుకోవడం, ప్రకృతి పరిరక్షణ కూడా స్వామి పూల అలంకరణ ఆంతర్యం అని కూడా చెప్పవచ్చు.శ్రీవేంకటేశ్వరునికి అలంకరించే పూలమాలలు కూడా ఒక క్రమ పద్ధతిలో ప్రత్యేకంగా ఉంటాయి. శ్రీవారి మూలమూర్తికి రోజూ అలంకరించే దండలివీ...
* శిఖామణి: కిరీటంపై నుంచి రెండు భుజాల వరకు అలంకరించే ఒకే ఒక దండ. ఇది 8 మూరలు ఉంటుంది.
* సాలిగ్రామ మాలలు: శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉంటాయి. ఇవి రెండు పొడవైన మాలలు. ఒక్కోటి నాలుగు మూరలు ఉంటుంది.
* కంఠసరి: మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకు అలంకరించి ఉండే దండ. ఒక్కోటి మూడున్నర మూరలు ఉంటుంది.
* వక్ష స్థల లక్ష్మీ: శ్రీవారి వక్ష స్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు రెండు దండలు. ఒక్కోటి ఒకటిన్నర మూరలు.
* శంఖు చక్రం: శంఖుచక్రాలకు రెండు దండలు. ఒక్కోటి ఒక్కో మూర.
* కఠారి సరం: స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ. రెండు మూరలు ఉంటుంది.
* తావళములు: రెండు మోచేతుల కింద మూడు మూరలు, నడుము నుంచి మోకాళ్లపై హారాలుగా మూడున్నర మూరల చొప్పున, మోకాళ్ల నుంచి పాదాల వరకు జీరాడుతూ నాలుగు మూరల పూల హారాలను అలంకరిస్తారు.
* తిరువడి దండలు: స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కోటి ఒక్కో మూర.
ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే స్వామి వారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసేసి స్వామి వారిని నిలువెల్లా పూల మాలలతో అలంకరిస్తారు.
ఇక్కడ పూచే పూలన్నీ కొండలరాయుడికే. అందుకే భక్తులెవరూ ఇక్కడ పూలు ధరించకూడదు. అది క్షేత్ర సంప్రదాయం. శ్రీ వేంకటేశ్వరస్వామికి నిత్యం జరిగే పుష్ప కైంకర్యంలో ప్రాచీన కాలం నుంచీ పేరిందేవితోట, అనంతాళ్వారు తోట, తాళ్లపాకం వారితోట, తరిగొండ వెంగమాంబ తోట, సురపురం వారి తోట, రాంబగీచ... ఇలా తిరుమల పర్వత శ్రేణుల్లోని పూలవనాల నుంచి తీసుకువచ్చిన పూలతో అర్చన జరిపించేవారు. అందుకే శ్రీనివాసుని పరమ భక్తురాలైన తరిగొండ వెంగమాంబ ‘పుష్పజాతుల విష్ణుబూజింపగల కొండ’ అని తిరుమల కొండ ప్రశస్తిని పేర్కొన్నారు.




స్వామివారికి అలంకరించిన పుష్పాలను ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం లేదు. కానీ ఏడాదిలో ఒకసారి తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవం సందర్భంగా స్వామివారి పూలమాలలు, పసుపు కుంకుమలు, పరిమళద్రవ్యాలు, లడ్డూలు, వడలను అంగరంగ వైభవంగా, ఊరేగింపుగా కాలినడకన తిరుమల నుంచి తిరుచానూరుకు తీసుకెళ్లి అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు. మిగిలిన రోజుల్లో తిరుమలలోని పూల బావిలో నిర్మాల్యాన్ని పడేస్తారు.
తిరుమల క్షేత్రంలోని తులసి, చామంతులు, గన్నేరు, మల్లెలు, సన్నజాజులు, మొగలి, తామర, కలువ, రోజాలు, సంపెంగలు, కనకాంబరం, మరువం, దవనం, మారేడు, మాచీపత్రం, మామిడాకులు, తమలపాకులు ఇలా రంగురంగుల పూల, పత్రాలను స్వామివారి కైంకర్యంలో వాడతారు. సిద్ధంచేసిన పూలను పూల అర నుంచి జియ్యంగార్లు నెత్తిపై పెట్టుకుని ఊరేగింపుగా తీసుకునివస్తారు.
- గంధం బసవ శంకరరావు

mohan publications price list