MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం_Sripada SriVallabha Charitamrutam- pitapuram







Sripada Srivallabha Charitamrutam in telugu 
 శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం



 SRI GURU CHARITRA in Telugu
Sri Vasudevananda Saraswati swamy
Telugu by eminent Pandit Sri Pannala Venkatadri Bhatta Sharma - pitapuram

శ్రీ గురు చరిత్ర
శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి
శ్రీ పన్నాలభట్ట శర్మ - పిఠాపురం
online....
-----------------------------------

శ్రీపాద శ్రీవల్లభులు

ఈ యుగంలో మొట్టమొదటి దత్తావతారం శ్రీపాదశ్రీవల్లభుడు. క్రీ.శ.1320లో ఘండికోట అప్పలరాజుశర్మగారికి, సుమతీ మహారాణికి తృతీయ సంతానంగా అవతరించారు. శ్రీపాదశ్రీవల్లభుడు. ఒకసారి నరసావధానులకు, శ్రీపాదులకు మధ్య ఆసక్తికరమైన చర్చ జరగుతుంది. జీవ్ఞడు, దేవ్ఞడు, కర్మ, వర్ణాశ్రమధర్మాలు, శాస్త్రము-వీటి ప్రస్తావన వస్తుంది. ఆ చర్చలో ‘ఏది ధర్మము, ఏది అధర్మము అనేది చర్చనీయాంశమైనప్పుడు శాస్రము నాశ్రయంచవలసిందే. అయితే శాస్త్రములో చెప్పినది ఆచరించదగునా? లేదా? అను మీమాంస వచ్చినప్పుడు నిర్మలాంతః కరణులు నిర్ణయించినదియే శాస్త్రమగును. వారు చెప్పినదే వేతమగును. వారి వాక్కు ధర్మ సమ్మతమగును. హింసచేయుట పాపమని నీశాస్త్రము చెప్పుచున్నది.
శ్రీకృష్ణ పరమాత్మ సమక్షములో జరిగిన యుద్ధము ధర్మ యుద్ధమైనదని,కౌరవ పాండవ యుద్ధము ధర్మయుద్ధమని అది జరిగిన స్థలము ధర్మక్షేత్రమని ప్రఖ్యాతి గాంచినది కదా! యజ్ఞము పుణ్యఫల ప్రదమే! కాని పరమాత్మ స్వరూపుడైన శివ్ఞని ఆహ్వానింపక దక్షుడు చేసిన యజ్ఞము ఆఖరికి యుద్ధముగా పరిణమించింది. దక్షుని తల తెగి పడింది. వానికి మేక తల అమర్చబడినది అని చెబుతారు. శ్రీపాదులవారు -(పుట 67-శ్రీపాద శ్రీవల్లభ చరిత్రామృతం). హింసతో నిండిన కురుక్షేత్ర యుద్ధం పవిత్రయజ్ఞంగా,వలసిన కార్యం హింసలో సమాప్తమైన యుద్ధంగా మారిన విషయాన్ని గుర్తుచేశారు శ్రీపాదులవారు. మరి,సాధారణ పండితులు శాస్త్రాన్ని ఉటంగిస్తూ ఉపనయనం శూద్రులకు చేయరాదని చెబుతారు. కానీ శ్రీపాద శ్రీవల్లభులు, ‘బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులకే కాదు శూద్రులు కూడా నియమనిష్ఠలను పాటించునెడల వేదోక్త ఉపనయమునకు అర్హులే! ఉపనయనము వలన మూడోకన్ను విచ్చుకోవలెను. అంతఃకరణము పరిశుద్ధమై బ్రహ్మజ్ఞానమునందు మనస్సు లగ్నమవవలెను, అని చెబుతారు. (పుట 67-శ్రీపాదశ్రీవల్లభ చరిత్రామృతం) దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఉండిన శ్రీపాదులవారికి ఎంత విశాల దృక్పధము , దూరదృష్టి ఉన్నదో గమనింపవలసి ఉన్నది. కులాన్ని గూర్చి చెబుతూ, ‘బ్రహ్మజ్ఞాన సంబంధ విషయములు వచ్చినప్పుడు నేను బ్రాహ్మణుడను, దర్బారు చేయుచు భక్తుల యోగక్షేమములు విచారించుచూ, వారిని అనుగ్రహించునపుడు నేను క్షత్రియుడను, ప్రతి జీవికి, ఈ జీవి చేయు పాపపుణ్య కర్మములను బట్టి, వేతనము నిర్ణయించబడును. ప్రతివాని వేతనమునూ నావద్ద యున్నది, తూచి కొలచి ఎవరికి ఎంతెంత ఇవ్వవలసినది లెక్క చూచుకొనునపుడు నేను వైశ్యుడను, భక్తులబాధలను, కష్టములను నాశరీరము మీదికి ఆకర్షించుకొని వారికి సుఖశాంతులను కలుగచేయుటవలన సేవాధర్మము నెరపుటవలన నేను శూద్రుడను. జీవ్ఞల యొక్క పాపములను ప్రక్షాళనము చేయునపుడు నేను చాకలిని. మరణించిన జీవ్ఞలను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మను ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటి కాపరిని. ఇప్పుడు నేను ఏకులము వాడినో తేల్చి చెప్పు అని అంటారు. శ్రీపాదశ్రీవల్లభుడు (పుట68-శ్రీపాదశ్రీవల్లభ చరిత్రామృతమ్‌).బ్రాహ్రణ, వైశ్య, శూద్ర, చండాలుల్లో కూడా నేనున్నాని శ్రీకృష్ణ పరమత్ముడు చెప్పాడు. ‘ఈవ్యాసమిదం సర్వంఅని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ‘సర్వం విష్ణుమయం అని మహనీయులంతా చెబుతున్నారు. అయినా హిందూ సమాజంలో నేటికీ అంటరానితనంముంది.
శూద్రుల కంటే మేము గొప్ప అని వైశ్యులు, వారందరి కంటే మేము ఉన్నతులమని బ్రాహ్మణులు ఇంకా ఈనాటికీ అహంకిరిస్తున్నారు. ”మామతం ఎంతో ఉన్నతమైనది,విశాలమైనది అని ఒక వైపు ఉపన్యాసాలిస్తూ మరో వైపు దళితులను దేవాలయాల్లోకి రానివ్వక, అంటకుండా దూరంగా పెడితే. నీచంగా చూస్తే అది మతానికి వన్నె తెచ్చే మార్గమా? ముట్టు,అంటు, మైల అని ఏవేవో సాకులు చూపి సంఘంలోని ఎనబైశాతం మంది స్రీలను,శ్రూద్రులను దళితలను ఆలయాల్లోకి రానివ్వకుండా ఆపితే ఆమతం ఎక్కవ కాలం మనగలదా? మనం శాస్త్రం,సాంప్రదాయం, ఆచారం,సంస్కృతి అని పెద్ద పెద్ద మాటలను పదే పదే వల్లె వేస్తే సరిపోతుందా? బాగా పరిశీలిస్తే మనం ఈనాడు ఏ శాస్త్రాన్ని అనుసరంచడం లేదు,
ఏమహాత్ముని బోధను ఆచరించడంలేదు. పరోపరామే పుణ్యమని,పరపీడనమే పాపమని వ్యాసభగవానులు చెప్పారు. దాన్ని ఆచరిస్తున్నామా? బ్రహ్మం సత్యం జగనిథ్య అని శంకరాచార్యుల వారు చెప్పారు. దాన్ని అవగాహన చేసుకున్నామా? ‘సర్వధర్మాన్‌ పరిత్సజ్య మామేకం శరణంవ్రజఅని శ్రీకృష్ణపరమాత్ముడు బోధించాడు. మనం అలా చేస్తున్నామా? ”సత్యమేవ జయతే నానృతం అని చెబుతుంది. శాస్త్రం. మనం దాన్ని నమ్మి ఆచరిస్తున్నామా? ఇతురులను పీడించి, హింసించి, మోసగించి మనల్ని మనం చాలా మంచివారమనుకొంటున్నాం దేవ్ఞడులే, గీవ్ఞడులే, డబ్బే ముఖ్యం అని సంపాదించడానికి నానా తంటాలు పడుతున్నాం . సత్యం యొక్క గొంతు నొక్కి నిమిషానికి అబద్దాలే పల్కుతున్నాం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో శ్రీపాదులు ధర్మాన్ని నిలబెట్టుటకై వచ్చిన అవతార పురుషులు. వారి బోధే ముఖ్యం గానీ సాధారణ పండితుల బోధకాదు. దివ్యత్వంను కాకపోయినా కనీసం మనుష్యతాన్నైనా పొందాలి మనం. అహంకారాన్ని తొలగించేదే శాస్త్రగానీ పెంచి పోషించేది కాదు. సంఘాన్ని సంఘటిం చేసే సత్పురుషుడు గానీ చీల్చేవాడు కాడు.

                                                                                                                        – రాచమడుగు శ్రీనివాసులు





శ్రీ అక్కల్కోట స్వామి సమర్ధ లీలామృతం 
Sri Akkalkota Swamy Samardha Leelamrutham



శ్రీ నరసింహ సరస్వతి చరితము 
Sri Narasimha Saraswathi Charithamu




శ్రీపాద శ్రీవల్లభ కథాసుధ 
SriPada SriVallabha Kathasudha



శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము
SriPada SriVallabha Leela Vibhavam
online....


శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం
Sripada SriVallabha Charitamrutam


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list