MohanPublications Print Books Online store clik Here Devullu.com

పుణ్యక్షేత్రాలు దర్శించుకున్న తర్వాత.. punyakshetram




పుణ్యక్షేత్రాలు దర్శించుకున్న తర్వాత.. ఇతరుల ఇళ్లకు వెళ్తే..


పుణ్యక్షేత్రాలు దర్శించుకున్న తర్వాత.. ఇతరుల ఇళ్లకు వెళ్తే.. యాత్ర వల్ల కలిగే పుణ్యమంతా వారికే దక్కుతుందని చెబుతారు. ఇది వాస్తవమా?- శ్రీనాథ్‌, అవనిగడ్డ

ఏదైనా పుణ్య‌క్షేత్రం దర్శించిన తర్వాత సరాసరి తమ ఇంటికే వెళ్లాలనీ, మరెవరి ఇళ్లకూ వెళ్లరాదనీ.. శాస్త్రాలు చెప్పలేదు. ఇది ఒక ఆచారంగా వచ్చింది. క్షేత్రంలో స్వామి దర్శనంతో కలిగిన దివ్యానుభూతిని పదే పదే తలుచుకుంటూ.. ఇంటికి వచ్చి సమారాధన చేసి పదిమందికి ఆ అనుభూతిని పంచిపెట్టాలి. బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తే.. అక్కడ మళ్లీ ప్రాపంచిక వ్యవహారాల ప్రస్తావనతో తీర్థయాత్ర, దైవ సందర్శన కాలక్షేపంగా మిగిలిపోతాయి.ఈ దృష్టితోనే పెద్దలు ఈ విధానాన్ని అనుసరించి ఉంటారు. ఇతరుల ఇళ్లకు వెళ్లినంత మాత్రాన.. యాత్ర చేసిన పుణ్యం ఆ కుటుంబానికి చెందుతుందనే అపోహ సరికాదు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list