MohanPublications Print Books Online store clik Here Devullu.com

వటసావిత్రీ వ్రతం-Vata Savitri Vratam







వటసావిత్రీ వ్రతం
సకల సౌభాగ్యాలను ప్రసాదించడంతో పాటూ వైధవ్యం నుంచి కాపాడేవ్రతం - ‘వటసావిత్రీ వ్రతం’. దీనిని జ్యేష్ఠ శుధ్ధ పూర్ణిమనాడు ఆచరించాలి. ఆ రోజు వీలుకాకపోతే జ్యేష్ఠబహుళ అమావాస్యనాడు ఆచరించవచ్చు. పూర్వం నారద మహర్షి సావిత్రికి ఈ వ్రతాన్ని గురించి వివరించినట్లు కథనం.
ఈ వ్రతాచరణ వెనుక ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. పూర్వం అశ్వపతి, మాళవి దంపతులకు ‘సావిత్రి’ అనే కుమార్తె వుండేది. యుక్తవయస్కురాలెైన సావిత్రికి నీకు ఇష్టమైనవాడిని వరించమని తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. రాజ్యం శత్రువులపాలు కావడంతో అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తోన్న ద్యుమత్సేనుడి కుమారుడెైన సత్య వంతుని వివాహమాడతానని తల్లిదండ్రులకు తెలిపింది. సత్య వంతుడి ఆయుష్షు మరో సంవత్సరమేనని నారదుడు చెప్పినప్ప టికీ, సావిత్రి పట్టుపట్టడంతో సత్యవంతుడితోనే వివాహం చేశా రు. మెట్టినింట చేరి భర్త, అత్తమామలకు సేవ చేయసాగింది. సత్యవంతుడు ఒకనాడు యజ్ఞ సమిధలు, పుష్పాలకోసం అడ వికి బయలుదేరగా, సావిత్రీ భర్తను అనుసరించింది. సమిధుల ను కోసి చెట్టు దిగిన సత్యవంతుడు తలభారంతో సావిత్రి ఒడి లో తలపెట్టుకుని పడుకున్నాడు. నారదుడు చెప్పిన సమయం ఆసన్నమైనదని సావిత్రి గుర్తించింది.
కొద్దిసేపటికి యముడు తన దూతలతో వచ్చి సత్యవంతుడికి యమపాశం వేసి తీసుకుని పోసాగాడు. సావిత్రి కూడ తన భర్తను అనుసరించి వెళ్ళసాగిం ది. యముడు వారించినప్పటికీ భర్త వెంటే తనకూ మార్గమని చెప్పి వెళ్తూండడంతో ఆమె పతి భక్తిని మెచ్చిన యముడు సావి త్రిని వరం కోరుకోమన్నాడు.
‘మామగారికి దృష్టి ప్రసాదించండి’ అని ఓ వరాన్ని కోరింది, యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తుండడంతో, యముడు మరో వరాన్ని కోరుకోమన్నా డు. మామగారు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ప్రసా దించమని కోరింది, యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తూండడంతో, ఆమె పతిభక్తిని మెచ్చి మూడో వరం కోరుకోమనగా - ‘నేను పుత్రులకు తల్లిని అయ్యేట్లు వరాన్ని ప్రసాదించండి’ అని కోరింది. యముడు సావిత్రి పతిభక్తిని మెచ్చి ఆ వరాన్ని ప్రసాదించాడు. సావిత్రి అడవిలో వటవృక్షం కింద ఉన్న భర్త శరీరం వద్దకు చేరింది. భర్త లేచి కూర్చోగా, వటవృక్షం వరకు పూజ చేసి భర్తతో సహా రాజ్యానికి చేరినట్లు కథ నం. వటవృక్షాన్ని, సావిత్రిని పూజిస్తూ చేసి ‘వట సావిత్రి వ్రతం’ అమల్లోకి వచ్చినట్లు పురాణ కథనం.
వ్రత విధానం
ఈ వ్రతం నాడు స్ర్తిలు వేకువ జామునే నిద్ర లేస్తారు. భక్తిశ్రద్ధలతో తలారా స్నానం చేస్తారు. కొత్త దుస్తులు ధరించి, చుట్టుపక్కల వారితో కలసి ఏటి ఒడ్డుకు వెళతారు. అక్కడ కడవలతో నీటిని సేకరించుకుని, సమీపంలో ఉన్న మర్రి చెట్లు దగ్గరికి వెళతారు. ముందు ఆ నీటితో మర్రిచెట్ల మూలాగ్రాన్ని శుభ్రం చేస్తారు. అనంతరం పసుపు, కుంకుమలు అద్ది, చెట్టుకుముందు అందమైన ముగ్గులు వేస్తారు. కొబ్బరికాయలు, అరటి పళ్ళు, ఇతర పిండివంటలు నైవేద్యం పెట్టి అనంతరం నూలు దారంపోగుల్ని చెట్టుమొదలు చుట్టూ కడతారు. అనంతరం చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి, తమ భర్తలు పది కాలాలపాటు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. తమ అభీష్టాలు నెరవేరాలని కోరుకుంటూ ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. ప్రశాంతతకు, శాంతికి చిహ్నంగా భావిస్తున్న వట (మర్రి) వృక్షాన్ని సాక్షాత్తు దైవస్వరూపంగా భావించి పూజలు చేస్తారు. అత్యంత పవిత్రమైన వృక్షరాజంగా పేర్గాంచిన మర్రిచెట్టును బోధి వృక్షంగా కూడా పిలుస్తారు. బౌద్ధులు ఈ వృక్షానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. గౌతమబుద్ధుడంతటివారు ఈ వృక్షం కిందే జ్ఞానవిముక్తిని పొందాడు. అలాగే బంధవిముక్తుడయ్యింది కూడా ఈ చెట్టు కిందే కావడంవల్ల ఈ వృక్షానికి అత్యంత ప్రాధాన్యం పెరిగింది. ఈ పూజలో భాగంగా వటవృక్షం కొమ్మలు విశాలంగా విస్తరించి, సేద తీరాలని కోరుకునే వారందరికీ నీడనిచ్చి, ఈ వృక్షానికి మల్లే తన భర్త కూడా కుటుంబ సభ్యులందరికీ, నీడనివ్వాలని మనసా వాచా కోరుకుంటారు. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో కొత్తగా పెళ్ళయిన యువతులతో ఈ వ్రతం చేయిస్తారు. ఈ సందర్భంగా మిఠాయిలు, పిండి వంటలు, ప్రసాదాలు తయారుచేస్తారు. వ్రతం సందర్భంగా బంధుమిత్రుల్ని ఆహ్వానించి, ఘనంగా పూజాది వేడుకలు నిర్వహిస్తారు.
వట సావిత్రి వ్రతం ప్రాచీన భారతం అయిన ‘మిథిల’లో ప్రాచుర్యం పొందినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ఈ వ్రతం ఆచరించే స్ర్తిలు మర్రిచెట్టుకు పూజలు చేసిన అనంతరం ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. తమ కోర్కెలకనుగుణంగా కొంతమంది ఒక రోజు, మరికొంతమంది ఒక పూట చొప్పున ఉపవాస దీక్ష చేసి, వ్రతం జరుపుకుంటారు. తమ భర్తల ఆరోగ్యాన్ని కాపాడి, మరో పది కాలాలపాటు మర్రిచెట్టులా కుటుంబమంతటికీ నీడనివ్వాలని, సాగించే ఈ వ్రతాన్ని జరుపుకోవడం విజ్ఞానపరంగా కూడా ఎంతో మేలైనదని పండితులు చెబుతారు.
వ్రతాన్ని చేసే వారు ముందు రోజు రాత్రి ఉపవాసం ఉం డాలి. వ్రతం రోజు తెల్లవారుఝామునే నిద్రలేచి తలస్నా నం చేసి, ఇంటిని శుభ్రపరిచి, దేవుడిని స్మరించుకుని, పూజావస్తువులను తీసుకుని వటవృక్షం (మర్రి) చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టు మొదలు వద్ద అలికి ముగుగ్లు వేసి, సావిత్రీ సత్యవంతులను ప్రతిష్టించాలి. వారి చిత్రపటాలు దొరకపోతే పసుపుతో చేసిన బొమ్మలనుగానీ ప్రతిష్టించు కోవాలి.
మనువెైధవ్యాదిసకలదోషపరిహారార్థం బ్రహ్మసావిత్రీ ప్రీత్యర్థం
సత్యవత్సావిత్రీ ప్రీత్యర్థంచ వటసావిత్రీ వ్రతం కరిష్యే అనే శ్లోకంతో సంకల్పించాలి.
చెప్ప వలసిన శ్లోకం:
వట మూలే స్తితో బ్రంహ వట మధ్యే జనార్దనః వటాగ్రే తు శివం విద్యాత్ సావిత్రివ్రత సమ్యుత వట సిన్చామితే మూలం సలిలైహి రంరుతోపయైహి ||
ఈ విధముగా మఱ్ఱి చెట్టుకు నీరు పోసి ప్రదక్షణము చేస్తే మీ భర్త అయురరోగ్యములతో వుండి మీకు దీర్ఘ సౌమంగల్యము కలిగేటట్టు అశీర్వాదము లభిన్చును.
మీ గృహములో దేవుని సన్నిధిలో చెప్పుకోవలసిన సంకల్పము
మమ జన్మ జన్మని అవైధవ్యప్రాప్త్యే భర్తుహు చిరాయు రారోగ్య సంపదాది ప్రాప్తి కామనయ సావిత్రి వ్రతం కరిష్యే తర్వాత కలశము స్తాపించి ప్రాణప్రతిష్ఠ వరకు చేసి
అస్మిన్ చిత్ర కలశే వట వృక్షం బ్రమ్హానం సావిత్రిం సత్యవంతం ధర్మరాజం నారదంచ ఆవాహయామి షోడశోపచార పూజలు చేసి కింద చెప్పిన శ్లోకములతో అర్ఘ్యము ఇవ్వవలెను
౧ ఓంకార పూర్వికే దేవి వీణా పుస్తక ధారిణి వేదమాత నమస్తుభ్యం సౌభాగ్యంచ ప్రయచ్చమే
౨ ఓంకార పూర్వికే దేవి సర్వ దుక్ఖ నివారిణి, వేదమాతర్నమస్తుభ్యం అవైదవ్యం ప్రయచ్చమే
౩ పతివ్రతే మహాభాగే వన్హియానే సూచి స్మితే ద్రుడవ్రతే ద్రుడమతే భర్తుస్చ ప్రియవాడిని
౪ అవైధవ్యం చ సౌభాఘ్యం దేహిత్వం మామ సువాతే పుత్రాన్ పౌత్రామ్స్చ సౌక్యంస్చ గృహాణార్ఘ్యం నమోస్తుతే
౫ త్వయా సృష్టం జగత్సర్వం సదేవాసుర మానవం సత్యవ్రతధరో దేవా బ్రమ్హరూప నమోస్తుతే
౬ త్వం కర్మసాక్షి లోకానాం శుభాశుభ విశేషకః గృహాణార్ఘ్యం ధర్మరాజ వైవస్వత నమోస్తుతే
౭ అవియోగ యథా దేవా సావిత్ర్యా సహితస్య చ అవియోగాస్థథాస్మాకం భూయాత్ జన్మని జన్మని
తర్వాత వినాయకుడు, సావిత్రీసత్యవంతులు, యమధర్మరాజు, బ్రహ్మదేవుడు, వటవృక్షాన్ని పూజించాలి. వట వృక్షమూలంతో బ్రహ్మ, మధ్యభాగంలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉంటారు కనుక త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది. పూజానంతరం ‘నమోవెైవస్వతాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ వటవృక్షానికి దారాన్ని చుడుతూ, 108 ప్రదక్షిణలు చేసి నెైవేద్యం సమర్పిం చడంతో పాటూ ముతె్తైదువులకు, బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలను సమర్పించాలి. ఇలా మఱ్ఱిచెట్టు చుట్టూ దారాన్ని చుట్టడం వల్ల మఱ్ఱి చెట్టు యొక్క దీర్ఘాయుర్దాయంతో, తన భర్త ఆయుర్దాయాన్ని బంధించినట్లవుతూ తన ఐదవతనం వర్థిల్లుతుందనేది ప్రతి స్ర్తీమూర్తి కోరిక.
కొందరు స్ర్తీలు ఈపండుగను పూర్ణిమనాడు మాత్రం అనుసరిస్తుంటారు. మూడు రోజుల పాటు ఈ పర్వాన్ని అనుసరించే స్ర్తీలు, త్రయోదశి ఉదయాన్నుంచి, పెైర్ణమి నాడు సాయంకాలం వరకు ఉపవసిస్తారు. పూర్తిగా నిరాహారంగా ఉండలేని వారు నీళ్ళు, పాలు, తేనీరు, పళ్ళు పుచ్చుకోవచ్చు.
అయితే ఈ వ్రతాన్ని మనదేశంలో ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. కొంతమంది పూర్ణిమ నాటి మధ్యాహ్నం పురోహితునితో సావిత్రి కథను చెప్పించుకుంటారు. పురోహితుని ద్వారా కథను వింటే తప్ప ఆ వ్రతానికి ఫలం దక్కదని కొంతమంది నమ్మకం. ఇలా వటసావిత్రి వ్రతవిధానాన్ని చేయవచ్చు.

 +++++++++++++++++++++

వటసావిత్రి(వ్రత)పౌర్ణమి" .

జ్యేష్ఠ మాసంలో అత్యంత ముఖ్యమైన పర్వదినంగా 'జ్యేష్ఠ పౌర్ణమి' చెప్పబడుతోంది. ఈ రోజున చేసే దానాల వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున పాదరక్షలు ... గొడుగులు దానం చేయడం వలన 'అశ్వమేథ యాగం' చేసినంతటి ఫలితం కలుగుతుంది. అందువలన చిన్నచిన్న దానాల వలన అనంతమైన ఫలితాలను అందించే పర్వదినంగా జ్యేష్ట పౌర్ణమి గురించి చెబుతుంటారు.

ఇక ఈ రోజున 'వట సావిత్రి వ్రతం' చేయడం వలన, సౌభాగ్యం స్థిరమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందువలన ఈ రోజున వివాహిత స్త్రీలు 'మర్రిచెట్టు' ను పూజిస్తూ వుంటారు. ఇక ఇదే రోజున రైతుల పండుగగా చెప్పబడుతోన్న 'ఏరువాక పున్నమి' కూడా జరుపుతుంటారు. రైతులు తమకి జీవనాధారమైన నేలతల్లిని ... ఎద్దులను పూజించి ఈ రోజున పొలాన్ని దున్నడం ప్రారంభిస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు ఎక్కువగా వుంటాయి కనుక, ఈ పండుగ సంబరాలు అక్కడే ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి ... కనువిందు చేస్తూవుంటాయి. దానాలు చేయడం వలన ... వట సావిత్రి వ్రతం వలన పుణ్యఫలాలను, ఏరువాక పండుగ వలన ఆనందాలను అందించేదిగా జ్యేష్ట పౌర్ణమి ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది

        స్త్రీలు వట సావిత్ర వ్రతాన్ని 'జ్యేష్ఠ పౌర్ణమి' రోజున ఆచరిస్తుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే యమధర్మరాజుని ఎదిరించి సావిత్రి తన భర్త ప్రాణాలను కాపాడుకోగలిగిందని చెప్పబడుతోంది. వట వృక్షం మూలంలో బ్రహ్మదేవుడు ... మధ్య భాగంలో విష్ణువు ... పై భాగంలో శివుడు ఉంటాడని పండితులు చెబుతున్నారు.
వట వృక్షాన్ని పూజిస్తూ సావిత్రి ఈ వ్రతాన్ని ఆచరించినది కాబట్టే, ఈ వ్రతానికి 'వట సావిత్రి' అనే పేరు వచ్చింది. ఈ వ్రతాన్ని త్రయోదశి రోజున ఆరంభించి పౌర్ణమి వరకూ, అంటే మూడు రోజులపాటు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. వివాహిత స్త్రీలు ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. మర్రిచెట్టు దగ్గరికి చేరుకొని అక్కడ శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టాలి.

    పసుపు కుంకుమలతో వట వృక్షాన్ని పూజించి, నైవేద్యాలు సమర్పించాలి. పసుపు దారాన్ని వట వృక్షానికి చుడుతూ ... 'నమో వైవస్వతాయ 'అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత ముత్తయిదువులకు దక్షిణ తాంబూలాలతో పాటు పండ్లను దానంగా ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వలన వైధవ్య దోషాలు తొలగిపోయి సౌభాగ్యం స్థిరంగా నిలిచి ఉంటుందని చెప్పబడుతోంది

         ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడే “వట సావిత్రి వ్రతము “ ఆచరించాలని  వ్రత గ్రంధాలూ పేర్కొన్నాయి. ఈ ‘ ఏరువాక పున్నమి’   నాడు వివాహిత మహిళలంతా కొత్త దుస్తులు ధరించి, ఏటి ఒడ్డున ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి, ఎర్రని సింధూరంతో ఆ మర్రి చెట్టును అలంకరించి, రంగురంగుల పుష్పాలతో పూజించి నూలు దారం పోగులను చెట్టు మొదలు చుట్టూ చుట్టి, ఏడు ప్రదక్షిణలు చేస్తూ,  తమ భర్తలు , సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్మంతులు  కావాలిని. ప్రార్ధిస్తారు. ఆ రోజంతా ఉపవాసం చేస్తారు. ఇలా వ్రతం చేయడం వల్ల తమ మాంగల్య సౌభాగ్యం పది కాలాలు చల్లగా, పచ్చగా, ఉంటుందని స్త్రీలందరి నమ్మకం. మరియు స్త్రీలు ఏ పూజ చేసినా ... ఏ నోము నోచినా ... ఏ వ్రతం చేసినా, తమ సౌభాగ్యం కలకాలం నిలిచి ఉండాలనేదే దానిలోని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలో వాళ్లు తమ సౌభాగ్యాన్ని స్థిరంగా ఉంచమని కోరుతూ ప్రత్యేకంగా వ్రతాలను కూడా ఆచరిస్తూ వుంటారు. అలాంటి వ్రతాలలో ముఖ్యమైనదిగా 'వట సావిత్రి' వ్రతం కనిపిస్తూ వుంటుం ది.

1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list