![Jamun fruit నేరేడు పండ్లను తినడం వల్ల కలిగే లాభాలివే..! Jamun Fruit neredu pandu neredu benifits to eat Jamun fruit bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu యోగాసన గ్రంథాలు Yoga Books,Yoga Sarvasvam Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU, KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjAUKiDWl7Y7sT3H7ndByugzhYNo6g_ew9knsSk84uDipmZFX2M0fln4QwHZFh_tHdvD6NWDVS37zuTRYHlTs2GaCbrsuJBRZAwYzdzeQPkhGKMye5W9i49iYZ8aTwwvWoMxBsDKGibVVaV/s640/Neredu+Pallu.jpg)
నేరేడు పండ్లను తినడం వల్ల
కలిగే లాభాలివే..!
నేరేడు పండ్లు మనకు మార్కెట్లో విరివిగా లభిస్తాయి. నిగనిగలాడుతూ.. నోరూరించే వీటిని ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని తినడం వల్ల మన శరీరానికి దాదాపుగా అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పలు అనారోగ్య సమస్యలు నయమవుతాయి. నేరేడు పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నేరేడు పండ్ల నుంచి క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, విటమిన్ సి, థయామిన్, ఫోలిక్ యాసిడ్, పీచు, ప్రొటీన్లు, కెరోటిన్లు లభిస్తాయి.
2. మధుమేహం ఉన్నవారికి నేరేడు పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయి. డయబెటిస్ నియంత్రణలో ఉంటుంది. వీటిలోని ఔషధ గుణాలు.. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. రక్తశుద్ధి జరుగుతుంది.
3. రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు ఈ పండ్లను ఎంత తింటే అంత మంచిది. నెలసరి సమయంలో బాగా నీరసపడిపోయే అమ్మాయిలు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. శరీరానికి సరిపడా ఐరన్ అందుతుంది.
4. వందగ్రాముల నేరేడు పండ్లలో యాభై ఐదు శాతం పొటాషియం ఉంటుంది. గుండె, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు వీటిని తింటే సరిపోతుంది. అరుగుదల సరిగా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండు రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
5. చిగుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం.. దుర్వాసన రావడం వంటి సమస్యలకు నేరేడు పండ్లు చక్కటి పరిష్కారం. వీటిని నమిలినప్పుడు పులుపూ, తీపి, వగరు కలబోతగా ఉండే రసం బ్యాక్టీరియాలను దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
6. ఈ కాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఈ పండు తీసుకోవడం వల్ల విటమిన్ సి అంది.. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565